Homeజాతీయ వార్తలుకాంగ్రెస్‌లో సీనియర్‌‌ నేతల ఐక్యతారాగం.. టార్గెట్‌ సాగర్‌‌ బైపోల్‌

కాంగ్రెస్‌లో సీనియర్‌‌ నేతల ఐక్యతారాగం.. టార్గెట్‌ సాగర్‌‌ బైపోల్‌

Telangana Congress
సాగర్‌‌ ఉప ఎన్నికలో ఎలాగైనా సత్తా చాటాలని అనుకుంటోంది కాంగ్రెస్‌ పార్టీ. అధికార పార్టీని ఈ ఎన్నికల్లో మట్టికరిపించాలని.. బీజేపీ దూకుడుగా అడ్డుకట్ట వేయాలని మొదటిసారి ఆ పార్టీ సీనియర్లంతా ఒక్కటయ్యారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. నేతల ఐక్యతా రాగం పై తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Also Read: తెలంగాణ రాజకీయాల్లో పవన్, షర్మిల ప్రభావం ఎంత?

ఇక త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో.. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జోష్ మొదలైంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్‌ సహా పలువురు నేతలు ఉమ్మడి జిల్లాలో ఏకతాటిపైకి వచ్చి పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న జానారెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ మనోధైర్యాన్ని పెంచుతున్నారు. ఇక.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పొలంబాట- పోరు బాట పేరుతో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల పూర్తి కోసం నార్కట్‌పల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర తలపెట్టారు. అయితే.. పాతిక మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పాదయాత్రపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Also Read: బీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌.. టార్గెట్‌ ఎమ్మెల్సీ

మరోవైపు నల్లగొండ-–ఖమ్మం– వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాములు నాయక్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య నాయకులంతా హాజరయ్యారు. ఎమ్మెల్సీతోపాటు సాగర్ బై పోల్‌లో కాంగ్రెస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. సీనియర్ నేతలంతా ఒక్కటవ్వడంతో కాంగ్రెస్ కేడర్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుల్ జోష్ లో ఉంది.మరి ఈ ఐక్యతారాగం ఎన్నికలు ముగిసేవరకు ఉంటుందా అనే సందేహాన్ని కొంత మంది సీనియర్‌‌ అనాలసిస్టులు అంటున్నారు. వీరి ఐక్యతతో అయినా పార్టీ బలం కొంత పెరుగుతుందని అంటున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular