Homeజాతీయ వార్తలుRS Praveen Kumar: హుజురాబాద్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీకి సిద్ధమేనా?

RS Praveen Kumar: హుజురాబాద్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీకి సిద్ధమేనా?

RS Praveen KumarRS Praveen Kumar: తెలంగాణ (Telangana) రాజకీయాలు మారుతున్నాయి. హుజురాబాద్ (Huzurabad) వేదికగా తిరుగుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు హుజురాబాద్ ఉప ఎన్నిక పైనే దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ దళితబంధు పథకంతో ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఈటల రాజేందర్ సానుభూతితో ఓట్లు సాధించుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించకుండానే తాత్సారం చేస్తోంది. కొండా సురేఖ పేరు వినిపించినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా మరుతోంది పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఎస్పీ కూడా తమ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను (RS Praveen Kumar) పోటీలో దింపాలని చూస్తున్నట్లు సమాచారం.

తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లగొండలో జరిగిన బహిరంగసభలో బీఎస్పీలో చేరారు. ప్రస్తుతం బీఎస్పీ రాష్ర్ట కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాల్సిందిగా ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈనెల 26న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగే బీఎస్పీ బహిరంగ సభలో ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారో లేదో అనేది తెలుస్తుందని చెబుతున్నారు.

ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే రాజకీయ సమీకరణలు మారుతాయని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ప్రవీణ్ కుమార్ కు మంచి పేరుంది. దీంతో వారి ఓట్లన్నీ ఆయనకు పడతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన పోటీపై అందరిలో ఆసక్తి నెలకొంది. హుజురాబాద్ లో సుమారు దళితుల ఓట్లు 50 వేల వరకు ఉండడంతో ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే బీజేపీ, టీఆర్ఎస్ కు ఓట్లు పడవనే పలువురు రాజీయ విశ్లేషకులు చెబుతున్నారు.

హుజురాబాద్ లో కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ గానే ప్రచారం సాగుతుండడంతో ఇక్కడ పోటీకి కాంగ్రెస్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ పోటీ చేస్తారని ప్రచారం సాగినా ఇంతవరకు ఆమె అభ్యర్థిత్వంపై ప్రకటించలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం హుజురాబాద్ పై దృష్టి సారించలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే సురేఖ పోటీకి షరతులు పెట్టినట్లు సమాచారం. ఏదిఏమైనా హుజురాబాద్ లో రాజకీయం ఎటు వైపు పోతుందో అర్థం కావడం లేదు.

నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఆగస్టు 11న బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీ కులాల చర్చా వేదిక జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీల స్థితిగతులపై మాట్లాడారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కావాలని ఆకాంక్షించారు. చరిత్ర తిరగరాయాలంటే బహుజన రాజ్యాన్ని స్థాపించాలని అభిప్రాయపడ్డారు. బహుజన రాజ్యంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular