Homeజాతీయ వార్తలుగ్రాడ్యుయేట్‌ ఎన్నికల ముందు పీఆర్సీ రచ్చ

గ్రాడ్యుయేట్‌ ఎన్నికల ముందు పీఆర్సీ రచ్చ

Graduate‌ election
ఏళ్ల తర్వాత తెలంగాణ ఉద్యోగుల ఎదురుచూపులకు తెరదించుతూ పీఆర్సీ రిపోర్ట్‌ వచ్చింది. కానీ.. ఆ కమిటీ ఆ రిపోర్టులో పొందుపరిచిన సిఫారసులు మాత్రం వారిని నిరాశకు గురిచేశాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు భగ్గుమన్నారు. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు మొదలుపెట్టింది. అయితే..ఈ చర్చలకు ప్రభుత్వం అన్ని సంఘాలను పిలువకపోవడంపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. కొందిరినే పిలవడంపై పలు ఉద్యోగ సంఘాలు ఫైర్‌‌ అవుతున్నాయి.

Also Read: సుజనా గప్‌చుప్‌..: ఎందుకు సైలెంట్‌ అయినట్లు..!

వేతన సవరణపై కమిషన్‌ రిపోర్ట్‌ అందిన తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో సీఎం కేసీఆర్‌‌ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు. ఒకవైపు పీఆర్సీ సిఫారసులపై ఉద్యోగులు భగ్గుమంటున్న సమయంలోనే ఈ చర్చల ప్రక్రియ మొదలైంది. కొన్ని సంఘాలతో భేటీ కూడా జరిగింది. అయితే.. అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను పిలిచి అభిప్రాయాలను తెలుసుకోవాలి. కానీ.. సీఎస్‌ కమిటీ పెట్టిన మెలికతో కొన్ని సంఘాలు ఇరకాటంలో పడ్డాయి.

అదర్‌ డ్యూటీ సౌకర్యం ఉన్న సంఘాలను మాత్రమే చర్చలకు పిలవాలని ఆ కమిటీ ప్రపోజన్‌ పెట్టింది. గత నెల 27 నుంచి 29 వరకు జరిగిన చర్చలకు ఓడీ సౌకర్యం ఉన్న యూనియన్లనే పిలిచారు. దాదాపు 13 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆ సమావేశానికి వచ్చాయి. పీఆర్సీ సిఫారసులపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. చర్చల విషయంలో కొన్ని యూనియన్లనే పిలవడం ఏంటని మిగతా ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.

Also Read: షర్మిల పార్టీ ప్రకటన అప్పుడే..: తేదీ ఖరారు..?

ఇదిలా ఉండగా.. ఈ ఉద్యోగ సంఘాలకు ఇప్పుడు విపక్ష పార్టీలు కూడా తోడయ్యాయి. దీంతో సీఎస్‌ కమిటీ మనసు మార్చుకుందో ఏమో.. మరికొన్ని సంఘాలతో భేటీ కావాలని నిర్ణయించింది. వారితో సమావేశానికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇప్పుడు అందరి దృష్టీ సీఎస్‌ ఆఫీస్‌పై ఉంది. ముందుగా అందరికీ పిలుపు రాకపోతే మిగతా యూనియన్ల ముందు చులకన అవుతామని భావిస్తున్న సంఘాలు క్రమంగా స్వరాలు పెంచుతున్నాయి. ఇంకోవైపు రోజులు గడుస్తున్నా సీఎస్‌ కమిటీ నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా పోయింది. దీంతో ఆహ్వానాల కోసం ఎదురుచూస్తున్న సంఘాలు డైలామాలో పడ్డాయట. పైగా చర్చల పేరుతో సీఎస్‌ కమిటీ కాలయాపన చేస్తోందనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల ముంగిట ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular