Smita Sabharwal : స్మితాసబర్వాల్… పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణలో చాలా మందికి సుపరిచితురాలు. ప్రతిభావంతురాలైన ఐఏఎస్. ఆమె ప్రతిభతోనే గత సీఎం కేసీఆర్ వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెను వివిధ శాఖలకు బదిలీ చేసింది. తాజాగా టూరిజం నుంచి ఆర్థిక శాఖకు బదిలీ కావడంతో ఆమె తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తాజాగా చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయ, పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశమైంది. టూరిజం శాఖ నుంచి ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదిలీ అయిన నేపథ్యంలో, స్మితా భగవద్గీతలోని ‘‘కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదాచన’’ శ్లోకాన్ని ఉటంకిస్తూ తన కర్తవ్య నిర్వహణపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ ట్వీట్లో ఆమె తన నాలుగు నెలల టూరిజం శాఖ పదవీ కాలంలో సాధించిన విజయాలను వివరిస్తూ, బదిలీని సానుకూలంగా స్వీకరిస్తున్నట్లు సందేశం ఇచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె వ్యక్తిత్వం, పరిపాలనా శైలిపై మరోసారి చర్చ మొదలైంది.
Also Read: ఒక్క మార్కు.. ఒకే ఒక్కమార్కు.. 1.85 లక్షల మందిని ఫెయిల్ చేసింది!
టూరిజం శాఖలో సాధించిన విజయాలు..
స్మితా సబర్వాల్ తన ట్వీట్లో టూరిజం శాఖలో తాను చేసిన కృషిని వివరించారు. నాలుగు నెలల వ్యవధిలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తెలంగాణ టూరిజం పాలసీ 2025–30ని రూపొందించి, రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త దిశను అందించినట్లు పేర్కొన్నారు. నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్ సర్క్యూట్లను పునరుద్ధరించడం, పెట్టుబడుల కోసం పటిష్ఠమైన చట్రాన్ని సష్టించడం, శాఖ పనితీరును మెరుగుపరచడం, జవాబుదారీతనాన్ని పెంపొందించడం వంటి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాక, గ్లోబల్ టూరిజం ఈవెంట్ నిర్వహణకు లాజిస్టిక్స్, ప్లానింగ్ కోసం పునాదులు వేసినట్లు తెలిపారు. ఈ సాధనలు తనకు ఆనందాన్ని, గౌరవాన్ని కలిగించాయని ఆమె తన ట్వీట్లో ఉద్ఘాటించారు.
కంచ గచ్చిబౌలి వివాదం..
స్మితా సబర్వాల్ బదిలీకి కంచ గచ్చిబౌలి భూ వివాదంతో ముడిపడిన వివాదాస్పద ట్వీట్లు కారణమైనట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో ఆమె ఒక ఏఐ–జనరేటెడ్ ఫోటోను రీట్వీట్ చేసినందుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అంతేకాక, రేవంత్ రెడ్డి నేతత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె చేసిన పోస్ట్లు వివాదాన్ని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆమెను టూరిజం శాఖ నుంచి ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ బదిలీని కొందరు రాజకీయంగా ప్రేరేపితమైనదిగా భావిస్తుండగా, మరికొందరు ఐఏఎస్ అధికారులు సోషల్ మీడియాలో వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేయడంపై పరిమితులను పాటించాలని సూచిస్తున్నారు.
సోషల్ మీడియాలో స్మితా స్టైల్..
స్మితా సబర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తం చేయడంలో పేరుగాంచారు. గతంలో కూడా ఆమె ట్వీట్లు పలు వివాదాలకు దారితీశాయి, ముఖ్యంగా ప్రభుత్వ విధానాలపై, సామాజిక అంశాలపై ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈసారి భగవద్గీత శ్లోకంతో బదిలీని సమర్థించుకున్న ఆమె ట్వీట్ను కొందరు ఆమె దృఢత్వానికి, సానుకూల దక్పథానికి చిహ్నంగా భావిస్తున్నారు. అయితే, సోషల్ మీడియాలో ఐఏఎస్ అధికారులు రాజకీయంగా సున్నితమైన అంశాలపై స్పందించడం సరైందేనా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. నెటిజన్లు ఆమె ట్వీట్ను విస్తృతంగా షేర్ చేస్తూ, ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని, వివాదాస్పద వ్యాఖ్యలను రెండు వైపులా విశ్లేషిస్తున్నారు.
టూరిజం శాఖపై ప్రభావం
స్మితా సబర్వాల్ టూరిజం శాఖలో తన స్వల్పకాలిక పదవీ కాలంలో చూపిన ప్రభావం గురించి విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు. తెలంగాణలోని ఆలయాలు, చారిత్రక స్థలాలు, సహజ సిద్ధమైన ప్రాంతాలను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానాలుగా మార్చడానికి ఆమె రూపొందించిన టూరిజం పాలసీ 2025–30 ఒక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ పాలసీ రాష్ట్ర ఆర్థిక వద్ధికి, స్థానిక ఉపాధి అవకాశాల సష్టికి దోహదపడే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఆమె బదిలీతో ఈ ప్రాజెక్టుల అమలు ఎలా సాగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
Also Read : స్మిత సబర్వాల్ పై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆమెను అందుకే టార్గెట్ చేశారా?