Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : తెలంగాణలో బీజేపీతోనే పవన్.. మరి ఏపీలో పొత్తు ఉందా? లేదా? ఏం...

Pawan Kalyan : తెలంగాణలో బీజేపీతోనే పవన్.. మరి ఏపీలో పొత్తు ఉందా? లేదా? ఏం జరుగబోతోంది?

Pawan Kalyan : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఓటు బ్యాంకు కలిగిన పార్టీలన్నింటిని తమవైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎత్తులు వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎట్టకేలకు అధికార బీఆర్ఎస్ పార్టీ , ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అడుగులు వేసింది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ ఒక ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది జరిగే తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్వయంగా అక్టోబర్‌లో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పక్కా కార్యాచరణ ప్రణాళిక లేకపోవడంతో పార్టీ క్యాడర్‌లో చాలా అనిశ్చితి నెలకొంది. ఎట్టకేలకు ఆయన ఇప్పుడు బీజేపీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తాజా నివేదికల ప్రకారం.. బీజేపీ అగ్రనేతలను కలవడానికి.. తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడానికి పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం కిషన్ రెడ్డితో పాటు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. మరో రెండు రోజుల్లో అమిత్ షా, జేపీ నడ్డాతో పవన్ సమావేశమై బీజేపీతో పొత్తు పెట్టుకుని జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య వంటి పలు అంశాలపై చర్చించి అధికారికంగా ప్రకటించనున్నారు.

గత నెలలో తెలంగాణకు చెందిన కొందరు ప్రముఖ జనసేన నేతలు పవన్‌ను కలిసి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ వెనక్కు తగ్గిందని, బీజేపీతో పొత్తు కారణంగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయలేదని, ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ వైదొలగవద్దని పవన్‌ని అభ్యర్థించారు.

టిటిడిపి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నందున, ఈ ఎన్నికల్లో వారు జనసేన-బిజెపి కూటమికి పరోక్షంగా మద్దతు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి వెళ్లాలని పవన్ దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. అయితే ఇప్పటికే తెలంగాణలో ప్రకటించిన అభ్యర్థులను కొనసాగిస్తారా? లేక వారందరినీ రద్దు చేసి బీజేపీకి సపోర్టు చేస్తారా? బీజేపీ తో పొత్తు పెట్టుకొని కొంత మంది అభ్యర్థులను బీజేపీ మద్దతుతో నిలబెడుతారా? అన్నది బీజేపీ పెద్దలతో పవన్ భేటి తర్వాత తేలనుంది.

తెలంగాణలో దాదాపు బీజేపీతో జనసేన పొత్తు ఖాయమైందనే చెప్పాలి. ఈ మేరకు కిషన్ రెడ్డి, పవన్ కలిసి బీజేపీ పెద్దలతో కలిసి ఈ ఎన్నికల సంగ్రామంలో దూకారు. మరి ఇప్పుడు ఇదే పొత్తు పొడుపులు ఏపీలో కొనసాగాలని జనసైనికులు, టీడీపీ నేతలు ఆశగా చూస్తున్నారు. బీజేపీ కలిసి వస్తే ఏపీలో జనసేన, టీడీపీ కూటమిదే క్లీన్ స్వీప్ ఖాయం. కానీ తెలంగాణలో ఈజీగా కలిసిన బీజేపీ.. ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా ముందుకు రావడం లేదు. స్పందించడం లేదు. పవన్ ఎంతగా కోరుతున్నా బీజేపీ పెద్దలు ఇప్పటివరకూ పొత్తు ప్రకటన రాలేదు. ఇప్పుడు తెలంగాణలో కలిసినట్టే ఏపీలోనూ కలవడం ఖాయమన్న చర్చ సాగుతోంది. పవన్ ఢిల్లీ టూర్ దీనికి బాటలు వేస్తుందని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular