Operation Sindoor
Operation Sindoor : భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం లో జరిగిన ఘాతుకానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. అయితే భారత్ ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్తాన్ భారత్ పై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో భారత్ సైతం పాకిస్తాన్ తిప్పి కొడుతుంది. ఈ యుద్ధంలో భాగంగా S 400 వంటి క్షిపణులను వాడుతూ పాకిస్తాన్ వేసే మిస్సైల్స్ ను తిప్పి కొడుతోంది. అయితే భారత్ పాకిస్తాన్ మాత్రమే కాకుండా.. ఇతర ఏ దేశాల్లో యుద్ధం జరిగిన అను బాంబు గురించి ప్రస్థాన వస్తుంది. ఇటీవల పాకిస్తాన్ సైతం భారత్ పై అనుభవం ప్రయోగిస్తామంటూ హెచ్చరించింది. అయితే ఒకవేళ పాకిస్తాన్ కనుక ఈ ఘోరానికి పాల్పడితే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. సాధారణ బాంబుల కంటే అనుభవం చాలా ప్రాణాంతకమైనది. అంతేకాకుండా దీనిని ప్రయోగించడం వల్ల ఎక్కువ శాతం నష్టపోయే అవకాశం ఉంది. ఒకవేళ దీనిని ప్రయోగిస్తే ఏం చేయాలంటే?
Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హీరోశిమా, నాగసాకిలపై అనుబాంబు ప్రయోగించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ మొ క్క మొలవడానికి కొంతకాలం పట్టింది. అంటే అను బాంబు తీవ్రత ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే పీకల మీది దాకా కష్టాలు వస్తే తప్ప ఏ దేశం అను బాంబు ప్రయోగించదు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది?
అను బాంబు ఏదైనా దేశం మరొక దేశంపై దాడి చేస్తే.. ఈ బాంబు పడిన చోటే కాకుండా చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం రేడియేషన్ శరవేగంగా వ్యాపిస్తుంది. అయితే ఈ బాంబు ప్రయోగం చేసిన తర్వాత.. రేడియేషన్ వేగంగా విస్తరించడం వల్ల మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకోసం ఈ బాంబు ప్రయోగం జరిగితే ప్రజలు దూరప్రాంతాలకు పరిగెత్తడం చేయకూడదు. ఇళ్లలోనే ఉండాలి. ముఖ్యంగా శరీరంపై కా దుస్తులు లేకుండా చేయాలి. ఆ దుస్తులను ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి ఉంచాలి. వాటిని ఎవరూ పట్టుకోకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువులు కూడా వీటిని తాకకుండా చూడాలి. ఎందుకంటే దుస్తులపై రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక రేడియేషన్ తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి. శరీరంపై ఎక్కువగా రుద్దకూడదు. కళ్ళు, చేతులు, కాళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి.
జపాన్ లోని హీరోషిమాలో అను బాంబు దాడి జరిగిన సమయంలో 80 వేల మంది చనిపోయారు. అనేకమంది వేడి తీవ్రతకు తట్టుకోలేక పోయారు. అలాగే నాగసాకిలో అనుతాని తర్వాత ఈ నగరం 80% ధ్వంసం అయిపోయింది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేనప్పటికీ మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైతే ఏదైనా దేశం ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అనేక దేశాల్లో అలజడి ప్రారంభమైంది. ఈ క్రమంలో అణుబాంబు గురించి తీవ్ర చర్చ సాగుతోంది.
Also Read : దేశంలోకి టెరిటోరియల్ ఆర్మీ.. ఇక పాక్ కు దబిడదిబిడే
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Operation sindoor nuclear bomb response
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com