Homeజాతీయ వార్తలుSuvendu Adhikari: సుబేందు అధికారి ని ఓడించేందుకు మమత కుట్ర.. ఏకంగా 100 కోట్ల ఖర్చు.....

Suvendu Adhikari: సుబేందు అధికారి ని ఓడించేందుకు మమత కుట్ర.. ఏకంగా 100 కోట్ల ఖర్చు.. ఇలా బయటపడింది

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడానికి మమతా బెనర్జీ వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. చివరికి ఓటర్లకు డబ్బులు పంచేందుకు కూడా వెనకాడ లేదు. బెంగాల్ రాష్ట్రంలో ఓటర్లకు డబ్బులు పంచే సంస్కృతి అంతగా ఉండదు. కానీ ఈసారి మమతా బెనర్జీ ఆ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా నందిగ్రామ్ ప్రాంతంలో పోటీ చేస్తున్న సుబేందు అధికారిని ఓడించేందుకు ఆమె అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఏకంగా 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

మమతా బెనర్జీ ఈ స్థాయిలో ఖర్చుపెట్టిన విషయాన్ని ఆమ్ జనతా ఉనయన్ పార్టీ అధినేత ఉమాయిబ్ బయటపెట్టారు.. ఈయన గతంలో తృణమూల్ కాంగ్రెస్ లో పనిచేసేవారు. ఎన్నికలకు ముందు మమతా బెనర్జీతో పొసగక బయటికి వచ్చేసారు. నందిగ్రామ్ లో షాహిద్ ఉల్ హక్ అనే అభ్యర్థిని తన పార్టీ తరఫున పోటీలో ఉంచారు. అయితే ఇక్కడ అధికారి విజయం సాధించారు. నందిగ్రామ్ లో సుభేందు అధికారిని ఓడించేందుకు మమత ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో.. అన్ని రకాలుగా చేసింది. కానీ అవి అంతగా పని చేయలేదు. అందువల్లే ఇక్కడ సుబేందు అధికారి విజయం సాధించారు.

ఈ 100 కోట్లు కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చాయని ఉమాయిబ్ చెబుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా మమతా బెనర్జీ వ్యవహరించారని.. సుబేందు అధికారిని ఓడించేందుకు ఏకంగా 100 కోట్ల వరకు ఖర్చు పెట్టారంటే.. మిగతా నియోజకవర్గాలలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఓటర్లకు 1000 నుంచి 5000 వరకు కవర్లో పెట్టి ఇచ్చారని.. అయితే మమత బెనర్జీ అరాచకాలు తెలిసి ఓటర్లు తెలివిగా నిర్ణయం తీసుకున్నారని ఉమాయిబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ఇంతవరకు తృణమూల్ కాంగ్రెస్ అవును అని గాని.. కాదు అని గాని.. చెప్పలేదు. ఒకవేళ ఇది గనుక నిజమని తేలితే.. అప్పుడు పరిణామాలు వేరే విధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బెంగాల్ రాష్ట్రంలో టిఎంసి తీవ్రమైన ప్రతిఘటన ప్రజల నుంచి ఎదుర్కొంటున్నది. ఆ పార్టీ నాయకులు బెంగాల్ నుంచి పారిపోతున్నారు. పార్టీ కార్యాలయాలు తాళం వేసి ఉంటున్నాయి. మమత బెనర్జీ కూడా కార్యకర్తలకు అంతగా అందుబాటులో ఉండడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper