spot_img
Homeజాతీయ వార్తలుకేటీఆర్ హడావుడికి కారణం అదేనా?

కేటీఆర్ హడావుడికి కారణం అదేనా?


త్వరలోనే గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో టీఆర్ఎస్ నాయకులు గ్రేటర్లో హడావుడి చేస్తున్నారు. ఇక గ్రేటర్ బాధ్యతలను భుజాన మోస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ హడావుడి మాములుగా లేదనే టాక్ విన్పిస్తోంది. గత నాలుగేళ్లుగా పూర్తికానీ పనులన్నీ మరో నాలుగు నెలల్లో పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు ఆఘమేఘాల మీద ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

Also Read: పదవీ విరమణపై.. ఉద్యోగుల్లో టెన్షన్?

గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ నగరవాసులు బోలెడన్నీ హామీలిచ్చారు. నగరవాసులకు ఆశల పల్లకి చూపడంతో ఆ ఎన్నికల్లో ప్రజలంతా అధికార పార్టీకే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ వంద స్థానాలను గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయగా అందుకు తగ్గట్టుగానే టీఆర్ఎస్ 99 స్థానాల్లో గెలిచి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఆ ఎన్నికల్లో కేటీఆర్ ఇచ్చినా హామీల్లో నేటికీ చాలావరకు పెండింగులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని నెలల్లో గ్రేటర్లో ఎన్నికలు జరుగనుండటంతో ప్రభుత్వం నగర అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రభుత్వం వేల కోట్ల నిధులు విడుదల చేసి అభివృద్ధి పనులను చేపడుతోంది. రహదారుల అభివృద్ధి, జలాశయాల సుందరీకరణ, స్కైవేల ఏర్పాటు, రేయిన్ గార్డెన్‌ల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్‌కు సొబగులు, తార్నాకలో టీవోడీ వంటి నిర్మాణాలను చేపట్టేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అక్టోబర్ నాటికి బాలానగర్ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తిచేసి నగరవాసులకు కానుకగా ఇవ్వాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.

వీటితోపాటు హుస్సేన్ సాగర్ కోసం ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ అధికారులు రూపొందిస్తున్నారు. పదెకరాల్లో రూ.12కోట్లతో లేక్ వ్యూ ఫ్రంట్ పార్కు నిర్మాణ పనులు.. ఉప్పల్ భగాయత్‌తోపాటు మరో 9ప్రదేశాల్లో రేయిన్ గార్డెన్‌లను నిర్మించేలా సన్నహాలు చేస్తున్నారు. నగర శివార్లలోని జల్‌పల్లి, రాంపల్లి చెరువులతోపాటు మరో 18చెరువులను సుందరీకరించేందుకు టెండర్లను పిలవాలని అధికారులకు నిర్ణయించారు. నగరంలో పాదచారుల ఇబ్బందులు తొలగించేలా ప్రత్యేక ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు.. పలు చోట్ల స్కైవేలను నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: వందల కోట్లు వృథా.. టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర్వాకం

వీటిన్నింటికి ఎంత ఖర్చు అయినా వెనుకడొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండటంతో అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. ఇన్నిరోజులు పెండింగులో ఉన్న పనులన్నీ ఒక్కసారి చేయాల్సి వస్తుండటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతున్ననట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కరోనా సాకుతో ఇంటికే పరిమితమైన నేతలంతా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నగరంలో నిత్యం పర్యటనలతో హడావుడి చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...
Oktelugu Epaper