ఐదేళ్లల్లో సంపూర్ణ మద్యం నిషేధం అమలు జరుపుతానని అధికారంలోకి వస్తూ హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వైపు, ఎన్టీ రామారావు అమలు పరచిన మద్యనిషేధానికి తూట్లు పొడిచిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలు తెరవడంతో జనం వెర్రిగా ఎగబడడంపై విచిత్ర వాదనలు చేస్తూ వస్తున్నారు.
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ లో చేదు వార్త!
మద్యపానాన్ని అరికట్టడంలో భాగంగానే భారీగా లిక్కర్ రేట్లను పెంచినట్లు సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. దశల వారీగా మద్యపానాన్ని నిషేధించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఇప్పుడు కూడా స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే లిక్కర్ రేట్లను 75శాతం అదనంగా పెంచామని సమర్ధించుకొంటున్నారు.
అసలు ఇప్పుడు మద్యం దుకాణాలు తెరవడానికి వెసులుబాటు కలిగించమని ముఖ్యమంత్రిని ఎవ్వరు కోరారు? అక్రమ మద్యం వ్యాపారాలు చేస్తున్న సొంత పార్టీ వారి ప్రయోజనాల కోసం అనుమతి ఇచ్చారా? లేదా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మద్యం షాపుల నుండి ప్రతి నెలా అందుతున్న `జె టాక్స్’ ఆగిపోవడంతో, దాని కోసమే ఈ చర్య తీసుకున్నారా?
మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4)
మద్య నిషేధం చేయాలనుకుంటే ఇంతకంటే బెస్ట్ టైమ్ ఉండదని చంద్రబాబు సెలవిస్తున్నారు. మద్యపాన నిషేధం చేయాలనుకుంటే లాక్ డౌన్ సమయంలో షాపులను పూర్తి మూసేయాలని హితవు చెప్పారు. తొందరపడి మద్యం దుకాణాలు ఎందుకు తెరిచారని, కమీషన్లు పోతాయని ప్రజల జీవితాలతో ఆడుకోవడం తగదని విమర్శలు గుప్పించారు.
మరి మామగారిని గద్దె దింపి, ఆ పదవి చేపట్టిన చంద్రబాబు తొందరపడి ఎందుకని మద్యనిషేధాన్ని తూట్లు పొడిచారో చెప్పగలరా? ప్రజారోగ్యం కోసం చేశారా లేదా కమీషన్లు పోతున్నాయని తొందర పడ్డారా? ఏనాడైనా సంజాయిషీ ఇవ్వవలసిందే గదా.
ఇలాగుంటే, కేంద్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోనే దాదాపు నెలన్నర తర్వాత లిక్కర్ షాపులు ఓపెన్ చేశామని అంటూ తప్పంతా కేంద్ర ప్రభుత్వానిదే అన్నట్లు వైసిపి ఎమ్యెల్యే అంబటి రాంబాబు తెలివిగా తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు.