Homeఅంతర్జాతీయంయుద్ధానికి స్టాప్: భారత్-చైనా కీలక నిర్ణయం

యుద్ధానికి స్టాప్: భారత్-చైనా కీలక నిర్ణయం

చైనా సైనికులు పదునైన కత్తులతో.. తుపాకులతో అవతలి సరిహద్దున కాచుకొని ఉన్నారు. భారత సైనికులు తొడగొడుతున్న ఈ క్రమంలోనే చైనా, భారత్ మధ్య సహృద్భావ వాతావరణం నెలకొంది. తాజాగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గురువారం సాయంత్రం భేటి అయ్యారు. ఈ చర్చల సందర్భంగా ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరుదేశాల మంత్రులు నిర్ణయించారు. ఐదు అంశాల పట్ల అంగీకారం కుదిరినట్లు వెల్లడించింది.

Also Read :  ఈఎంఐ, రుణాల మీద కేంద్రం, ఆర్బీఐ వైఖరేంటి?

భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రికతలు హీట్ పెంచుతున్నాయి. యుద్ధం అనివార్యం అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఐదు అంశాల ప్రణాళిక ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అంగీకరించాయి.

ఇరుదేశాల మధ్య సైనిక చర్చలు జరిగి బలగాల ఉపసంహరణ జరగాలి. ఇరు దేశాల సైన్యాల మధ్య దూరం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇండియా చైనా బార్డర్ ఆఫైర్స్ కమిటీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు.

ఉద్రిక్తతలు తగ్గగానే ఇరు దేశాల మధ్య విశ్వాసం పెంపొందించేలా చర్యలు వేగవంతం చేయాలని ఇరుదేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయంచారు.  ఈ మేరకు వివాదాలు విభేదాలుగా మారకుండా చూసుకోవాలని ఇరుదేశాల సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోడీ, జిన్ పింగ్ ల మధ్య జరిగిన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. ఐదు అంశాలను పటిష్టంగా అమలు చేసి సరిహద్దుల్లో శాంతి, ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని నిర్ణయించారు. చైనా దీనికి కట్టుబడాలని భారత్ కోరింది. బలగాలు ఉపసంహరించాలని సూచించింది.

Also Read : చైనాకు ఇక వణుకే.. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular