అన్ని రాష్ట్రాలు సీఎంలు ఢిల్లీకి వస్తుంటారు. అయితే వారంతా పగలు ఉదయం నుంచి సాయంత్రం 6 లోపే ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తుంటారు. కానీ ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఆయన సాయంత్రాలు, రాత్రుళ్లు మాత్రమే వీరిని కలుస్తుంటారని రాజకీయవర్గాల్లో ఓ ప్రచారం ఉంది.
తాజాగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. హోంమంత్రి అమిత్ షా ఏకంగా రాత్రి 9 గంటలకు జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.సాధారణంగా అమిత్ షా రాత్రి 7 గంటల తర్వాత అధికారిక కార్యక్రమాలు ఏవీ పెట్టుకోరు. సమీక్షలు, మీటింగ్ లు ముందే పూర్తి చేస్తారు. అయితే సీఎం జగన్ కు మాత్రం ఎప్పుడు వెళ్లినా రాత్రియే అపాయింట్ మెంట్ ఇచ్చి కలవడం ఆసక్తిరేపుతోంది. దీంతో ఇవన్నీ అనధికార సమావేశాలు అయ్యి ఉంటాయని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అమిత్ షాతో జగన్ భేటి ఖచ్చితంగా వ్యక్తిగతం అయ్యి ఉంటుందని.. అందుకే ఇలా రాత్రుళ్లు కలిస్తున్నారని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు రచ్చను కంట్రోల్ చేయడానికే జగన్ ఈ ఢిల్లీ టూర్ ను ఎంచుకున్నారని.. అమిత్ షాతో ఆయన నోటికి తాళం వేయించబోతున్నారని టాక్ నడుస్తోంది.
సీఎం జగన్ ప్రభుత్వాలకు సంబంధించిన అధికారిక సమావేశమైతే ముఖ్యమంత్రులు అడిగిన వెంటనే ఉదయం పూట అధికారులు ఉండే సమయంలోనే సమయం ఇచ్చి సమస్యలపై చర్చిస్తారని.. జగన్ రాత్రి కలుస్తుండడంతో ఇదంతా వ్యక్తిగత ఎజెండా కావచ్చన్న చర్చ సాగుతోంది.