ఇళ్లల్లోనే రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయాలు అందరికీ తెలిసినవేనన్నారు.
కరోనా వైరస్ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు రంజాన్ కూడా వచ్చిందన్నారు.
ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ రంజాన్మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మీ అందర్నీ అభ్యర్థిస్తున్నానని చెప్పారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు మత పెద్దలను కోరారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి అని చెప్పారు.
మరోవైపు రాష్ట్రంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16 కేసులు గత 24 గంటల్లో నమోదు అయ్యాయి. దీంతో లాక్ డౌన్ మరింత కట్టు దట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.