Homeఆంధ్రప్రదేశ్‌ఆర్ఎస్ఎస్ సూచనతోనే టిటిడి ఆస్తులపై జగన్ వెనుకడుగు!

ఆర్ఎస్ఎస్ సూచనతోనే టిటిడి ఆస్తులపై జగన్ వెనుకడుగు!


ఎందరు వ్యతిరేకించినా, చివరకు కోర్ట్ లు మొట్టికాయలు వేసినా ఒక సారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెనుకడుగు వేయడం తెలియదు. ఈ విషయంలో సొంత పార్టీ వారి అభిప్రాయాలను కూడా ఖాతరు చేయరు.

అయితే టిటిడి భూముల వేలంపాట విషయంలో ఆయన వెనుకడుగు వేయడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా ఈ నిర్ణయానికి వ్యతిరేకత ఎదురైనా అంత బలంగా లేదు. సోషల్ మీడియా లోనే ఎక్కువగా కనిపించింది. లాక్ డౌన్ కారణంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపే పరిస్థితులలో లేవు.

పైగా ఆస్తుల అమ్మకపు నిర్ణయాన్ని సమర్ధవంతంగా సమర్ధించుకోవడంలో జగన్ కు సన్నిహిత బంధువైన టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయం సాధించారు. గత టిడిపి పాలనలోనే ఆస్తుల అమ్మకపు నిర్ణయం తీసుకున్నారని బలమైన వాదన చేయగలిగారు.

అయితే ఆయన స్వరంలో అకస్మాత్తుగా సోమవారం మార్పు వచ్చింది. ఆబ్బె వేలంవేసే నిర్ణయం తీసుకోలేదని, కేవలం ప్రతిపాదన దశలో మాత్రమే ఉన్నదని చెప్పుకొంటూ వచ్చారు. టిటిడి ఆస్తుల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోమని రాజ్యసభ నామినేట్ సభ్యుడైన ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతకర్త రాకేష్ సిన్హా కోరగానే ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం గమనార్హం.

టిటిడి ట్రస్ట్ బోర్డు లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. అంటే ఆర్ ఎస్ ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు స్పష్టం అవుతున్నది. బిజెపి నాయకత్వంతో కన్నా ఆర్ ఎస్ ఎస్ నాయకత్వంతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం పట్ల జగన్ చాల ఆసక్తిగా ఉన్నట్లు ఈ అంశం వెల్లడి చేస్తుంది.

2019 ఎన్నికలలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు మూకుమ్మడిగా మద్దతు ఇవ్వడంతోనే జగన్ అనూహ్యంగా 151 సీట్లు గెల్చుకున్నారని గమనార్హం. జగన్ క్రైస్తవ సంబంధాల పట్ల ఆర్ ఎస్ ఎస్ లో ఆయనంటే కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పట్ల గల ద్వేష భావన కారణంగా జగన్ ను పూర్తిగా వ్యతిరేకించలేక పోతున్నారు.

అందుకనే జగన్ ఆర్ ఎస్ ఎస్ కు తగు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు సుబ్బారెడ్డి వారధిగా ఉంటున్నారు. ఆయన కనీసం మూడు సార్లు విజయవాడ లోని ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంపై వెళ్లి, ఆ సంస్థ ప్రముఖ నాయకులతో మంతనాలు జరిపారు.

టిటిడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సమయంలో బిజెపి నుండి నలుగురికి ప్రాతినిధ్యం ఇవ్వాలని జగన్ భావించారు. అందుకు పేర్లు సూచించమని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కోరారు. కన్నా వెంటనే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను సంప్రదించగా ఆయన స్పష్టంగా తిరస్కరించారు. జగన్ ప్రభుత్వంలో తమకు ఎటువంటి నామినేట్ పదవులు ఆశించడం లేదని స్పష్టం చేశారు.

బిజెపి నిరాకరించినా ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత వేత్త రాకేష్ సిన్హాకు టిటిడి బోర్డు లో జగన్ సభ్యత్వం కల్పించడం గమనిస్తే ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం వద్ద ఆయనకు గల పలుకుబడిని వెల్లడి చేస్తుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper