దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఇదే విషయాన్ని అనౌన్స్ చేసింది. కేంద్రం ప్రకటించిన నాటి నుంచి అక్కడ ఉద్యమం నడుస్తూనే ఉంది. దీనిపై సీఎం జగన్ కూడా కేంద్రానికి ఓ లేఖ రాశారు. ప్రైవేటు పరం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూపారు. కానీ.. అదేపనిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాయలేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. లేఖ రాస్తే జైల్లో పెడతారని భయమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read: ‘విశాఖ ఉక్కు’పై స్పందించిన చంద్రబాబు.. ప్రధాని మోదీకి లేఖ..
ఇదిలా ఉంటే.. తమ నేత లేఖ రాశారని టీడీపీ నేతలు వాపోతున్నారు. అయితే.. చంద్రబాబు వాళ్ల మాటలను పట్టించుకున్నారో లేక వ్యూహాత్మకంగా కొద్ది రోజులు ఆలస్యం చేశారో కానీ ఆదివారం ప్రధాని మోడీకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని లేఖ పంపేశారు. అందులో.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఏం చేయాలో కొన్ని సూచనలు చేశారు. వాజ్ పేయి హయాంలో ఇలానే స్టీల్ ప్లాంట్కు ఇబ్బందికర పరిస్థితులు వస్తే అప్పట్లో కేంద్రం.. దాదాపుగా 1300 కోట్లు కేటాయించి కాపాడిందని.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పనిచేయాలని చంద్రబాబు కోరారు.
Also Read: ఈ మాత్రం దానికి ఉద్యోగ సంఘాలతో భేటీ ఎందుకో..?
అయితే.. ప్రతిపక్ష హోదాలో ఉండగా చంద్రబాబు లేఖ రాయడం అందరికీ కామన్. కానీ.. ఆ విషయాన్ని ఉమ్మడి రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వడం అన్నంతగా వైసీపీ సీన్ క్రియేట్ చేసింది. దానికి తగ్గట్లుగా ఆయన ఆగి ఆగి లేఖ రాశారు. ఇప్పుడు.. వైసీపీ నేతలకు విమర్శించడానికి ఏమీ లేకుండా పోతోంది. ఇప్పుడు టీడీపీ నేతలు అధికార పార్టీ హోదాలో.. గతంలో ప్రత్యేకహోదా కోసం టీడీపీ పోరాడినట్లుగా వైసీపీ నేతలు పోరాడాలని సవాల్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడం.. ప్రధాని ఇంటిని ముట్టడించడం వంటివి చేయాలని సవాల్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
అసెంబ్లీ తీర్మానాల వల్ల పావలా ప్రయోజనం కూడా ఉండదని రాజకీయవర్గాలకు తెలుసు. కార్మిక సంఘాలతో సమావేశమైనప్పుడు సీఎం జగన్ కూడా తాను లేఖ రాసి ఫిఫ్టీన్ డేస్ అంటే పదిరోజులు గడిచినప్పటికీ.. ఎలాంటి రిప్లై రాలేదని చెప్పుకొచ్చి ఆవేదన చెందారు. ఇదంతా చంద్రబాబు మొదటి ఐదేళ్లు అనుభవించారు కాబట్టి రిప్లయ్ వస్తుందని కూడా ఆయన అనుకోరు. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయాలు చేస్తూ.. అన్ని పార్టీలు టైం పాస్ చేస్తున్నాయి. అదే సమయంలో ఏ పార్టీ కూడా సమన్వయంతో పోరాటం సాగించడం లేదని వాపోతున్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Chandrababu writes letter to pm modi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com