మద్యపాన నిషేధం చేయాలనుకుంటే ఇంతకంటే సమయం ఏముందని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తొందరపడి మద్యం దుకాణాలు ఎందుకు తెరిచారని నిలదీశారు. మద్యం దుకాణాలను తెరవడంపై ఆయన మండిపడ్డారు. ఇష్టానుసారం మద్యం దుకాణాలు తెరిచారని అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. చదువు చెప్పే టీచర్లను మద్యం షాపుల వద్ద పెడతారా? అని ప్రశ్నించారు. చట్టాన్ని గౌరవించాలని తాను హైదరాబాద్లోనే ఉండిపోయానన్నారు. తనపై లేనిపోని విమర్శలు చేశారన్నారు.
సాంబమూర్తి చెప్పినవన్నీ అసత్యాలే..!
మద్యం వల్ల రాష్ట్రంలో చాలా మంది చనిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. మద్యం దుకాణాలు వద్దని మహిళలు ఆందోళన చేశారన్నారు. రేట్లు పెంచితే మద్యపాన నిషేధం జరుగుతుందని చెప్పి ఇవాళ 50శాతం మద్యం ధరలు పెంచారన్నారు. మీకు నచ్చిన బ్రాండ్లను మాత్రమే పెడతారా? లేదంటే జేట్యాక్స్ కోసం నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఇస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కమీషన్లు పోతాయని ప్రజల జీవితాలతో ఆడుకుంటారా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో రైతులు చితికిపోయారన్నారు. ధాన్యం కొంటున్నామన్నారని కానీ హైకోర్టులో మీ డొల్లతనం బయటపడిందని బాబు పేర్కొన్నారు.