Homeజాతీయ వార్తలుబీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌.. టార్గెట్‌ ఎమ్మెల్సీ

బీజేపీ వర్సెస్‌ టీఆర్‌‌ఎస్‌.. టార్గెట్‌ ఎమ్మెల్సీ

TRS vs BJP
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు హీట్‌ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమో కానీ.. మరోసారి అధికార పక్షం, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం గురించి బీజేపీపై విమర్శలు చేసేటప్పుడు ఐటీఐఆర్ ప్రాజెక్టును హైలెట్ చేసిన కేటీఆర్.. వరంగల్‌కు పోయి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని లేవనెత్తి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అక్కడా బీజేపీ కూడాగట్టిగానే పోటీ పడుతుండటంతో కేంద్రం చేస్తున్న అన్యాయంపై కేటీఆర్ గళమెత్తారు.

Also Read: కాల్వ మెడకు ఎన్నికల కమిషన్ ఉచ్చు

తెలంగాణకు అన్యాయం చేయడం కేంద్రానికి అలవాటైందని.. కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన హామీని.. రద్దు చేసే అధికారం బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. కేటీఆర్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించడంతో బీజేపీ నేతలు ఉలిక్కి పడ్డారు. ఐటీఐఆర్ తరహాలోనే టీఆర్ఎస్ వల్లే కోచ్ ఫ్యాక్టరీ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణలో అలసత్వం కారణంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మరో రాష్ట్రానికి తరలిపోయింది, కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు వచ్చే అవకాశాలు లేవని బీజేపీ నేత డీకే అరుణ తేల్చి చెప్పేశారు. ఇతర నేతలు కూడా అదే చెబుతున్నారు.

కేంద్రం విభజన హామీల ప్రకారం చూసుకుంటే.. అనేక హామీలు నెరవేర్చాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ లేవనెత్తడానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రెడీగా ఉంటుంది. నల్లగొండలోనూ అనేక అంశాలు ఉంటాయి. బీజేపీని ఇరుకున పెట్టడానికి టీఆర్ఎస్‌కు కావాల్సినన్ని అస్త్రాలున్నాయి. అయితే.. అన్నింటినీ టీఆర్ఎస్ వల్లే రాలేదంటూ దూకుడుగా ఎదురుదాడికి దిగుతూ.. బీజేపీ కూడా ఘాటు రాజకీయం చేస్తూనే ఉంది.

Also Read: యాదాద్రి ప్రారంభోత్సవానికి ప్రణాళికలు.. అందుకే కేసీఆర్‌‌ ఆలయాన్ని సందర్శించారా..?

మొత్తంగా మరోసారి ఇరుపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికల వాతావరణం మరోసారి యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలూ ఛాలెంజ్‌గా తీసుకోవడంతో విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకవైపు హైదరాబాద్‌ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీజేపీ తాపత్రయ పడుతుండగా.. బీజేపీ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్‌‌ఎస్‌ ప్రయత్నాల్లో ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular