Homeజాతీయ వార్తలుకృష్ణా జలాలపై ఇప్పుడు బిజెపి రెండు కళ్ళ సిద్ధాంతం!

కృష్ణా జలాలపై ఇప్పుడు బిజెపి రెండు కళ్ళ సిద్ధాంతం!

గతంలో కీలకమైన అంశాలపై నిర్దుష్టమైన విధానం లేకుండా `రెండు కళ్ళ సిద్ధాంతం’ అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలు అనుసరించేవారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశమై ఇదేవిధమైన ధోరణి అనుసరించి రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు.

ఇప్పుడు బీజేపీ సహితం శ్రీశైలం నుండి కృష్ణా జలాలను తరాయించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వివాదం ఏర్పడిన సందర్భంగా ఇదే విధానం అనుసరిస్తుంది. ఒక వంక బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కృష్ణా జలాల తరలింపుపై ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోకు నిరసనగా రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు.

మరోవంక, ఆ జిఓను సమర్ధిస్తూ ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటన చేశారు. శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఏపీకి ఉందనిస్పష్టం చేశారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తేల్చి చెప్పారు.

తెలంగాణతో ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తారో, ఏమీ చేస్తారో తెలియదని… రాయలసీమకు మాత్రం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బీజేపీ పోరాటాలు చేసిందని కన్నా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.

జాతీయ పార్టీ అని చెప్పుకొనే బీజేపీ ఒకొక్క రాష్ట్రంలో ఒకొక్క విధానం అనుసరిస్తూ ప్రజల భవోద్వేగాలతో ఆటలాడుకొనే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ప్రాంతీయ పార్టీలకు ఎట్లాగూ తమ ప్రాంత ప్రజల పక్షాన నిలబడక తప్పదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ సహితం ఒక స్పష్టమైన విధానం ఆవలంభించలేదా?

ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సంజయ్ కుమార్ దీక్ష చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచటాన్ని బీజేపీ తప్పు పడ్తోంది. జీవో 203పై తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్ బోర్డ్, కోర్టుకు వెళ్ళాలని బీజేపీ డిమాండ్ చేసింది.

నీళ్లు ,నియామకాలు ,నిధులు పేరుతో ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ కెసిఆర్ స్వార్ధ బుద్ధితో మరోసారి నీళ్ల దోపిడికి గురి అయ్యే అవకాశం ఉందని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

అపర భగీరథుడు గా తన వందిమాగధులు చేత పొగిడించు కుంటున్న కేసీఆర్ పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచి నీళ్లు దోచుకుంటున్న జగన్ ప్రభుత్వం గురించి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Oktelugu Epaper