Homeజాతీయ వార్తలుమీడియా రంగంలోకి బీజేపీ? ఆ రెండు చానెళ్లతో చర్చలు!

మీడియా రంగంలోకి బీజేపీ? ఆ రెండు చానెళ్లతో చర్చలు!

BJP in the media? Negotiations with those two channels!
రాజకీయాలను.. మీడియాలను విడదీయలేం.. సొంతంగా మీడియా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలం. ఇప్పుడు తెలుగు నాట చూసుకున్నా.. కేంద్రంలో చూసుకున్నా.. ప్రతీపార్టీకి బలమైన మీడియా ఉంది.

తెలంగాణలో టీఆర్ఎస్ కు నమస్తే తెలంగాణ దినపత్రిక, టీన్యూస్ చానెల్ సొంతంగా ఉండగా.. టీవీ9 లాంటి పెద్ద చానెల్ సపోర్టు ఉంది. ఇక ఏపీలో వైసీపీకి సాక్షి మీడియా, టీడీపీకి ఏబీఎన్, ఈనాడు సహా పలు మీడియా చానెళ్ల మద్దతు ఉంది. మీడియా చేతిలో లేకుంటే ఏ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లిలేకపోతుందని.. అందుకే రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే మీడియా సపోర్టు అవసరమని అన్ని పార్టీలు భావించి పలు మీడియా సంస్థల్లో తెరవెనుక పెట్టుబడులు పెడుతుంటాయి.

Also Read : గ్రేటర్ పై కన్నేసిన బీజేపీ.. వ్యూహమెంటీ?

ఈ క్రమంలోనే తెలంగాణలో బలపడాలని ఆశిస్తున్న బీజేపీ కూడా ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెట్టాలని డిసైడ్ అయినట్టు తెలిసింది. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు కుదేలవుతున్న వేళ టీఆర్ఎస్ కు ప్రత్యామ్మయంగా బీజేపీ ఎదుగుతోంది. ఈ క్రమంలోనే పార్టీకి మద్దతు అవసరం అని బీజేపీ భావిస్తోంది. బలమైన మీడియా ఉంటే తప్పా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లలేమని కమలదళం భావిస్తోంది. తమకు కేంద్ర నాయకత్వం నుంచి ఇప్పటికే ఆమోదం లభించిందని.. మీడియాలను కొనడానికి యోచిస్తున్నామని తెలంగాణ బీజేపీ నాయకులు అంటున్నారు.

తెలంగాణలో బీజేపీ రెండు మధ్యస్థాయి చానెళ్లను కొనడానికి రెడీ అయ్యిందని సమాచారం. బీజేపీ అనుకూల వైఖరితో ఉడే జర్నలిస్టులను, సీఈవోను, చీఫ్ ఎడిటర్ ను నియమించాలని శూలశోధన మొదలు పెట్టినట్టు తెలిసింది. ఈ చానెళ్ల యాజమాన్యాలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు చెబుతున్నారు.బీజేపీ కేంద్రంలోని పెద్దలతో ఈ చానెళ్ల యజమానులతో మాట్లాడిస్తూ వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తోందని విశ్వసనీయంగా తెలిసింది.

ప్రస్తుతం తెలంగాణలో రెండు మీడియా సంస్థలను కొనే పనిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్టు తెలిసింది. కాగా ఈ చానెల్ లను స్వాధీనం చేసుకోవడానికి.. వాటిని నడపడానికి బీజేపీలోని కొంతమంది వ్యాపారులను ఒప్పించారని వార్తలు వస్తున్నాయి.

2024 ఎన్నికలకు ముందు మీడియాలో బలమైన గొంతుకగా బీజేపీని మలచాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ రెండు చానెళ్లలో ఒకటి స్థానిక చానెల్. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరొకటి తమిళనాడులో హెడ్ ఆఫీస్ కలిగి ఉంది. ఈ రెండింటిని కొనేందుకు బీజేపీ చర్చలు జరుపుతోందని సమాచారం.

-నరేశ్

Also Read : బై బై గణేశా.. సందడి లేకుండానే విగ్రహాల నిమజ్జనం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper