స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో పరిపాలన కార్యాలయాలను విశాఖపట్నంకు తరలించే అంశం తిరిగి తెరపైకి వచ్చింది. ఉగాది నాటికే కొన్ని కార్యాలయాలను తరలించాలని భావించినప్పయిటీకి ఎన్నికల కారణంగా కుదరలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ సడలింపు వంటి కారణాలతో పాలనా రాజధాని తరలింపు పై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
దీనిలో భాగంగానే ఉద్యోగులనూ మానసికంగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి అనుగుణంగానే సచివాలయ ఉద్యోగ సంఘం మే చివరి నాటికి విశాఖకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది. తరలింపు ప్రక్రియను ఉగాదికి ప్రారంభించి మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే, పదో తరగతి పరీక్షలు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు జగరనుండటంతో ఆ తరువాతే తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
సచివాలయ ఉద్యోగ సంఘం కార్యనిర్వాహక వర్గ సమావేశం సైతం మే నెలాఖరు నాటికి విశాఖకు వెళ్లేందుకు అభ్యంతరం లేదని ప్రకటించారు. అదే సమయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం. కావాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు.
ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తిగా ఎంతమంది అమరావతికి తరలివచ్చారు, వారి పిల్లల్లో ఎంతమంది ఇక్కడ చదువుకుంటున్నారు, ఉద్యోగుల్లో ఎంతమంది ఇక్కడ సొంత ఇళ్లు నిర్మించుకున్నారు, ఎంతమంది అద్దె ఇళ్లలో నివాసముంటున్నారు, ఎంతమంది ప్రభుత్వం సమకూర్చిన నివాసాల్లో ఉంటున్నారు అనే వివరాలనూ ఉద్యోగ సంఘ నేతలు సేకరిస్తున్నారు.
విశాఖకు వెళ్లేందుకు సిబ్బందికి ఉన్న సమస్యలు పరిష్కరించాలని, సౌకర్యాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరామని, ప్రభుత్వం దీనిపై సానుకూలత వ్యక్తం చేసిందని ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పిల్లలకు స్కూల్ అడ్మిషన్లు, తాత్కాలిక ఉచిత వసతి ప్రభుత్వమే చూసుకోవాలని కోరామని, నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు ఉద్యోగుల తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
ఉద్యోగుల డిమాండ్ లలో కొత్తగా ఇళ్ల స్థలాలు, పాత ఇళ్ల స్థలాలకు వడ్డీ లేని రుణాలు, స్పౌస్ బదిలీ అవకాశాలు (కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, అంతర్రాష్ట్ర అవకాశాలు, స్థానికత కూడా), తరలింపు అలవెన్స్, అమరావతిలో ఇల్లు, ఇళ్ల స్థలాలు తీసుకోనివారికి ప్రత్యేక రుణాలు, 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్, విశాఖకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం వంటివి ఉన్నాయి.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Ap secretariat employees likely to shift to vizag in may
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com