
గంగవరం పోర్టు విశాఖలో ప్రైవేటు రంగంలో ఏర్పాటు అయింది. ప్రభుత్వ రంగంలో ఒకటి ఉండగా ప్రైవేటులో మళ్లీ ఎందుకు అనే ప్రశ్న వచ్చింది. ఈ పోర్టు స్టీల్ ప్లాంట్ అవసరాలు తీరుస్తుంది. స్టీల్ ప్లాంట్ మిగుు భూముల నుంచి రెండు వేల ఎకరాలను కూడా తీసుకుని మరీ కేటాయించారు. గంగవరం పోర్టుని డిజైన్ చేసింది డీడీఎస్ రాజు కన్సార్టియం. గంగవరం పోర్టులో మేజర్ షేర్ వారిదే. 58 శాతం వాటాు వారికే ఉన్నాయి. ఇక మరో 31 శాతంతో విండీలేక్ సైడ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ ఉంది.
ఒక దేశంలో ఇప్పుడు నయా శిఖరంగా అదానీపేరు వినిపిస్తోంది.పోర్టు రంగంలో అదానీ ఏస్వామ్యమే కొనసాగుతోంది. అందులో భాగంగా ఏపీో చాలా పోర్టులు వారి ఖాతాలోకే వెళ్లనున్నాయి. ఇక విశాఖో గంగవరం పోర్టుని కూడా అదానీ సంస్థ కొనేసింది. నూటికి తొంభై శాతం వాటాలు ఉన్న డీవీఎస్ రాజు కన్సార్టియంతో పాటు విండీ లేక్ సైడ్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ నుంచి కూడా భారీ మొత్తాను ఇచ్చి మరీ టోటల్ వాటాను తీసుకుని గంగవరం తన పరం చేసుకుంది.
ఇందుకోసం రాష్ర్ట ప్రభుత్వం కార్యదర్శులతో ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ నిర్ణయం లాంచనమే. అతిత్వరలో ఏపీ సర్కారు వాటాలు కూడా అదానికే దక్కబోతున్నాయి. నూటికి నూరు శాతం గంగవరం పోర్టు తొందరలోనే అదానీ గ్రూప్ పరం కాబోతోంది. అదానీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి. పోర్టు రంగంలో పాన్ ఇండియా లెవల్ లోనే అదానీ దిగ్గజం కాబోతోంది. ఇక విశాఖో చూసుకుంటే ఏడాదికి రూ.7 కోట్ల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో కార్గో పోర్టుగా గంగవరం నిలుస్తోంది.
విశాఖ పోర్టు ట్రస్ట్ నాడే గంగవరం పోర్టుకు అభ్యంతరంవ్యక్తం చేసింది. కానీ ఏవో ఎన్నో ప్రయోగాలు పేరు చెప్పి కథ నడిపించారు. ఇపుడు అదానీకి మొత్తం దాసోహమంటున్నారు. అదానీ బిగ్ షాట్. దాంతో ఇప్పటికే గంగవరం పోర్టుతో ఇబ్బందులు పడుతున్న విశాఖ పోర్టుకు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది. రానున్న రోజుల్లో అదానీ దూకుడు మామూలుగా ఉండదని, గంగవరం పోర్టు ఆపరేషన్ తో విశాఖ పోర్టు కుదేల్ అయినా ఆశ్చర్యం లేదు.