Homeఆంధ్రప్రదేశ్‌ఏపీ పోర్టులన్నీ ఆ దిగ్గజ పారిశ్రామికవేత్తకేనా?

ఏపీ పోర్టులన్నీ ఆ దిగ్గజ పారిశ్రామికవేత్తకేనా?

Adani
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కొత్త పోర్టులు కడుతాం అంటూ ఆయా పార్టీలు హామీలు ఇస్తుంటాయి. కానీ.. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తవు. అలాగని ప్రైవేటు వ్యక్తులు ఎవరూ రారు. కానీ.. ఉన్న పోర్టులు చేతులు మారిపోతుంటే ఏం చేయాలి. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును కొనుగోలు చేసేసిన మోడీ సన్నిహితుడు తాజాగా గంగవరం పోర్టును కొంటున్నట్లు సమాచారం. దీంతోపాటు భావన పాడు పోర్టు కూడా అతనికే ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.

Also Read: కేసీఆర్ ప్రక్షాళన.. సీఎంవోపై జగన్ నజర్?

ఇప్పటికే ఏపీలో ప్రైవేటీకరణ అంశం సెగలు రేపుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయించడంతో ఇక విశాఖ పోర్టును కూడా అలాగే చేస్తారన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో ఏపీలోని తీర ప్రాంత పోర్టులను మోడీ సన్నిహితుడు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారుతోంది. మోడీ సన్నిహితుడైన అతనిది ప్రధానంగా పోర్టులు.. ఎయిర్‌పోర్టుల వ్యాపారం. పోర్టుల విషయంలో ఇప్పటికే పట్టు సాధించారు. చివరికి ఆంధ్రప్రదేశ్‌లోని అతి పెద్ద ప్రైవేటు పోర్టు కృష్ణపట్నం కూడా అతని చేతుల్లోకి వెళ్లిపోయింది.

Also Read: ఏపీలో త్వరలో డీఎస్సీ

దీంతో ఆయన మరికొన్ని పోర్టులపై గురి పెట్టారు. జైపూర్, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం ద్వారా లీజ్ ఇచ్చే విధానంలో అతనికే అప్పగించారు. భారత ప్రభుత్వం రైళ్లను కూడా ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంది. వీటిలోనూ ఆయన ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాల చేతుల్లో ఉండాల్సిందేనన్న గట్టి అభిప్రాయాలు వినిపించే పోర్టులు.. ఎయిర్‌పోర్టులు.. రైళ్లు వంటి వాటిలో ప్రైవేటు పెట్టుబడులను విపరీతంగా ఆహ్వానించడం.. అదీ కూడా.. బీజేపీతో సన్నిహితంగా ఉండే పారిశ్రామిక వేత్తలకు అగ్రతాంబూలం వేస్తుండడం చర్చకు దారితీస్తున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

వాటాలు అమ్మకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. అందుకే పారిశ్రామికవేత్తలు భయపడి అతనికి ఆస్తులు అప్పగించేస్తున్నారు. కొద్ది రోజుల కిందట.. జీవీ కృష్ణారెడ్డికి చెందిన ఆస్తులపై సీబీఐ, ఈడీ దాడులు చేసింది. దానికి కారణం ముంబై ఎయిర్‌పోర్టు. అందులో వాటాలు మోడీ సన్నిహితుడికి అమ్మడానికి ఆయన నిరాకరించారు. దాడులు జరిగాయి. తర్వాత జీవీ కృష్ణారెడ్డి వాటాలను తప్పనసరి పరిస్థితిలో అతనికే అప్పగించాల్సి వచ్చింది. దాంతో ఆ కేసు కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. అన్ని చోట్లా ఇదే తరహా డీలింగ్స్ నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

3 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular