Homeఎంటర్టైన్మెంట్Allu Aravind: అల్లు అరవింద్, పరుశురాం మధ్య గొడవకు కారణం ఏంటి?

Allu Aravind: అల్లు అరవింద్, పరుశురాం మధ్య గొడవకు కారణం ఏంటి?

Allu Aravind: ఎంతో మంది డైరెక్టర్లు ఈ మధ్య మంచి మంచి సినిమాలు చేస్తూ హిట్ లను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇందులో పురుశురాం ఒకరు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. గీతా గోవిందం సినిమాతో మంచి హిట్ ను అందుకున్న విజయ్ ఇప్పుడు పరుశురాంతో సినిమా చేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందట. ఈ మధ్య సరైనా హిట్ లేక బాధపడుతున్న విజయ్ కు ఖుషీ సినిమా హిట్ ను అందించింది.

ఖుషీ హిట్ తర్వాత వచ్చే సినిమా విజయ్ కెరీర్ లో టర్న్ అవుతుంది. ఈ సినిమా హిట్ అయితే ఒకే కానీ.. డిజాస్టర్ ఫలితాలను అందుకుంటే మళ్లీ విజయ్ దేవరకొండకు టెన్షన్ తప్పదు. అందుకే పరుశురాంతో చేసే ఈ సినిమాపైనే అంచనాలు పెట్టుకున్నారట రౌడీ భాయ్. గీతా గోవిందం సినిమా వీరి కాంబోలో వచ్చే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇప్పుడు మళ్లీ ఇదే కాంబో రిపీట్ అవడంతో అభిమానులు కూడా ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయాల్సింది. కానీ అది కుదరడం లేదట.

గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి పరుశురాం మధ్య మధ్య విభేదాలు రావడంతో దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నాడట. ఇక వీళ్ళ మధ్య ఏం జరిగింది అంటే అల్లు అరవింద్ తన కొడుకు అల్లు శిరీష్ తో ఒక సినిమా చేయమని అడిగితే పరుశురాం దానికి ఇష్టపడలేదట. ఇప్పటికే శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా చేశాడు అది మంచి విజయాన్ని అందుకుంది.కానీ మరో సినిమా చేయాలంటే కుదరదు అని పరుశురాం అనడంతో తదుపరి సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉండలేనని తిరస్కరించారట అల్లు అరవింద్. దీంతో పరుశురాం దిల్ రాజు తో మూవీ చేయడానికి రెఢీ అయ్యాడు. ఇక ఇంతకు ముందు గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే గీత గోవిందం సినిమా వచ్చి సూపర్ హిట్ ను అందుకుంది. మరి ఈ సారి ఎలా ఉంటుందో చూడాలి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular