Pawan Kalyan- Vijayendra Prasad: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరే ఒక సంచలనం. ఈ పేరు స్క్రీన్ మీద కనిపిస్తే పూనకాలు లోడింగ్. ఆయన సినిమా హిట్ అయితే ఇండస్ట్రీ షేక్ కావడం ఖాయం. కానీ ఆయన సినిమాలు ఫెయిల్ అయిన కానీ ఊహించని కలెక్షన్స్ వస్తాయి. దానికి కారణం పవర్ స్టార్. స్టార్ హీరో అనే పదానికి సరైన నిర్వచనం అని చెప్పవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా “బ్రో” గత శుక్రవారం విడుదల అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
సాధారణంగా సినిమాకు ఇలాంటి టాక్ వస్తే కోలుకోవడం కష్టం, కానీ ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ సినిమా అందుకే ఊహించని వసూళ్లు సొంతం చేసుకుంటుంది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 75 కోట్లు సాధించిన ఈ సినిమా ఈజీగా 150 కోట్లు రేంజ్ కి పోవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుకు వస్తుంది. గతంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు సరిగ్గా సరిపోతాయి పవన్ కళ్యాణ్ సినిమాకు.
అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక షో కి గెస్ట్ గా వచ్చిన విజయేంద్ర ప్రసాద్ ను పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి స్టోరీ రాస్తారు ? అని అడగటంతో ఆయనకు కథ అవసరం లేదంటూ విజయేంద్రప్రసాద్ చెప్పాడు.. అదేంటి ? అంటూ అలీ అడగటంతో పవన్ కళ్యాణ్ నటించిన పాత సినిమాల్లో కొన్ని సీన్స్ తీసుకోని కథ రాయవచ్చు. పెద్దగా స్టోరీ కోసం కష్ట పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ను చూడటానికి జనాలు వస్తారు. డైనమేట్ ను పేల్చడానికి ఒక చిన్న అగ్గిపుల్ల చాలు అంటూ ఆనాడు విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు ఇప్పుడు బ్రో సినిమాకు సరిగ్గా సరిపోయాయి.
నిజానికి ఈ సినిమాలో స్టోరీ పెద్దగా లేదని, పవన్ కళ్యాణ్ గత సినిమాల్లో కొన్ని సీన్లు తీసుకోని సినిమా చేశారు అనే టాక్ వినిపిస్తున్న కానీ, సినిమా మాత్రం ఒక రేంజ్ లో హిట్ అవుతుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పవచ్చు. దీనిని బట్టి ఆయన స్టార్ డమ్ ఏమిటో మరోసారి రుజువు అయ్యింది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో, సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ 2024 లో జరిగే ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాడు. మరోపక్క ఉస్తాద్, OG సినిమాల కోసం కూడా పని చేస్తున్నారు.