SSMB29: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్ ఎస్ఎంబి 29 సినిమా గురించే డిస్కస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని రాజమౌళి పాన్ వరల్డ్ లో తెరకెక్కిస్తుండడం విశేషం.. ఇక ఎప్పుడైతే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిందో అప్పటినుంచి దీని మీద భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక మొత్తానికైతే ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసిన రాజమౌళి ఈ సినిమాని తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్తాము అంటూ చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు.
మరి మొత్తానికైతే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనే దాని మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ గా ఈ సినిమా మీద స్పందిస్తూ ఈ మూవీ మీద ఉన్న కొన్ని అనుమానాలను అయితే తేటతెల్లం చేశాడు. అందులో మొదటిది త్రిబుల్ ఆర్ సినిమా లాగా ఈ సినిమా కూడా పీరియాడికల్ డ్రామా సినిమాగా తెరకెక్కుతుందా అని అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానంగా ఈ సినిమా ప్రియాడికల్ నేపథ్యంలో రావడం లేదు.
Also Read: Pushpa 2: పుష్ప 2 కి పోటీగా దిగుతున్న రెండు సినిమాలు ఇవే…
ప్రస్తుత కాలంలోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాము. కాంటెంపరరీ ఇష్యూస్ తోనే ఈ సినిమా అనేది ముందుకు సాగబోతుంది అంటూ తను ఈ సినిమా మీద ఒక సరైన క్లారిటీ అయితే ఇచ్చాడు. దీంతో ఈ సినిమా మీద ఉన్న అనుమానాలు చాలావరకు తొలగిపోతాయి. ఇక ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసినప్పటికీ రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన సెట్ వర్క్స్ ని చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది.
Also Read: Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఏమైంది? ఆందోళన రేపుతున్న ఫోటో!
ఇక సెట్ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చిన తర్వాతే ఈ మూవీని పట్టాలెక్కిస్తారట… అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మరొక నెల నుంచి రెండు నెలల సమయం వరకు పట్టొచ్చు అని ఆయన చెప్పడం విశేషం…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More