Rajamouli , Mahesh babu
SSMB 29 : సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘SSMB 29’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ, యాక్షన్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దుర్గ బ్యానర్స్లో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కథపై రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మహేష్తో ఈ కథనే ఎందుకు?
సీనియర్ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా కథ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. “భారతీయ సినిమాలో అడ్వెంచర్ థ్రిల్లర్ జానర్ను అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్ కూడా భారత్ వైపు చూస్తోంది. కాబట్టి ఈ సినిమాని ఆ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం” అని తెలిపారు.
మహేష్ బాబు ఇప్పటి వరకు అలాంటి కథలను చేయలేదు కాబట్టి, ఈ సినిమాకు అతను బెస్ట్ ఫిట్ అవుతాడని అన్నారు. “ఇంతవరకు మహేష్ బాబు చేసిన సినిమాల్లో ఇదే సరికొత్త ఛాలెంజ్. ప్రపంచ స్థాయిలో ఈ సినిమాను తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పారు.
విలన్ గా ప్రియాంక చోప్రా..?
ఇప్పటికే హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలను షూట్ చేశారు. తాజాగా కెన్యాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా ఇతర నటీనటులతో సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదట.. ఆమె విలన్ రోల్ పోషిస్తోందని తెలుస్తోంది. మహేష్ సరసన నటించే హీరోయిన్ కోసం మరో ఇంటర్నేషనల్ బ్యూటీ ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు హాలీవుడ్ నటి పేర్లు పరిశీలనలో ఉన్నాయని టాక్.
సీక్రెట్ గా ఉంచేందుకు భారీ ప్లాన్..!
ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులకు ఛాన్స్ ఇవ్వకుండా చిత్రబృందం కఠినమైన రూల్స్ పెట్టిందట! అందుకే నటీనటులు, టెక్నీషియన్లందరికీ ‘నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్’ (NDA) కుదుర్చుకుంది. సినిమా వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి విజువల్స్!
‘SSMB 29’ సినిమా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఇందులో ఉండనున్నాయి. ఇండియాలో ఏదీ లేనంత గ్రాండ్గా సినిమాను తెరకెక్కించేందుకు రాజమౌళి టీమ్ రెడీ అవుతోంది.
పాన్-వరల్డ్ మూవీ
మొత్తానికి మహేష్ బాబు కెరీర్లోనే ఇప్పటి వరకు లేని కొత్త తరహా సినిమా తీసుకురావడానికి రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ జోడీ రెడీ అవుతుంది. పాన్-ఇండియా కాదు, పాన్-వరల్డ్ లెవల్ మూవీగా ‘SSMB 29’ తెరకెక్కబోతోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో, ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Vijayendra prasad reveals why rajamouli chose the adventure thriller genre for mahesh babus ssmb29 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com