Tollywood
Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉన్న నటీమణులలో సావిత్రి ఒకరు…ఈమె చేసిన చాలా పాత్రలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా ప్రేక్షకులు ఆమె నటనకు గుర్తుగా ఆమెను ‘మహానటి’ గా పిలుచుకునేవారు. ఇక ఈమె తర్వాత ఇండస్ట్రీ లో అంత మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య..ఈమె చేసే ప్రతి పాత్ర కూడా చాలా కొత్తగా ఉండేది. ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన సబ్జెక్ట్ లను తను ఎక్కువగా సెలెక్ట్ చేసుకొని ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కలిసికట్టుగా తన సినిమాలు చూసే విధంగా స్టోరీలను సెలెక్ట్ చేసుకొని వాటిలో నటించేది.
అందువల్లే ఆమెకి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి విపరీతమైన ఆదరణ అయితే వచ్చింది. ఇక స్టార్ హీరోలందరితో నటించిన ఆమె కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకుంది. అయినప్పటికీ ఆమె ఎక్కడా కూడా తడబడకుండా తన సినిమాలను తను చేసుకుంటూ ముందుకు అయితే సాగింది. పాత్ర ఏదైనా సరే సౌందర్య నటించిన సినిమా అంటే ఆ సినిమాను చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కి వచ్చేవారు. ఇలాంటి సందర్భంలోనే సౌందర్య లాంటి నటి ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేంతలా పేరు సంపాదించుకొని అభిమానుల్లో ఒక మంచి గుర్తింపును కూడా పొందింది… ఒకప్పుడు సావిత్రి గారు చాలా మంచి క్యారెక్టర్స్ చేసి నటిగా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఇక ఆమె తర్వాత సౌందర్య గారు తనదైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సూపర్ సక్సెస్ లను కూడా అందుకున్నారు. ఈమెను గోల్డెన్ లెగ్ గా కూడా పిలిచేవారు…
సాయి పల్లవి
మరి వీళ్ళిద్దరి తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న హీరోయిన్లలో ఎవరు సావిత్రి, సౌందర్య గారి ప్లేస్ ని రీప్లేస్ చేయబోతున్నారు అనే విషయాల మీద కూడా చాలా వరకు చర్చలైతే జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ‘సాయి పల్లవి’ కి వాళ్ల ప్లేస్ లను రీప్లేస్ చేసే అవకాశం ఉంది అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆమె కూడా సావిత్రి, సౌందర్య గారి లాగానే సెలెక్టెడ్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను పొందుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆమెను మించిన నటిమణులు ఎవరు లేరు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. అక్కడ రామాయణం లో సీత పాత్ర ను పోషిస్తూ తన కెరియర్ లో మరొక మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు తన మార్కెట్ ను కూడా పాన్ ఇండియా స్థాయి కి విస్తరింప చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే తను ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇలాంటి క్రమంలో సాయి పల్లవి నుంచి వచ్చే సినిమాల కోసం అభిమానులే కాకుండా ప్రేక్షకలోకం సైతం ఎదురుచూస్తున్నారు. ఒకప్పటి సావిత్రి ఆమె తర్వాత సౌందర్య ఆ తర్వాత సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీ లో చాలా అరుదుగా ఉంటారు. వీళ్ల కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవడం లో సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు వాళ్లు ఎలాంటి కథలనైతే చేసేవారో ఇప్పుడు సాయి పల్లవి కూడా అలాంటి కథలను ఎంచుకొని సినిమాగా చేస్తుంది. మరి వాళ్ళంతటి క్రేజ్ ను సాయి పల్లవి సంపాదించుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Do you know who is the heroine of this generation who gets recognition like savitri and soundarya
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com