ఒక్కోసారి మంచి పనులు చేస్తూ కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రసుతం మెగా స్టార్ చిరంజీవి అలాంటి పరిస్థితే పేస్ చేసాడు. కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ అమలు అవుతున్న కారణంగా తెలుగు సినీ పరిశ్రమ స్తంభించి పోయింది. దాంతో షూటింగ్ లతో పాటు చిత్ర రంగానికి చెందిన కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఆ క్రమంలో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో విరాళాల సేకరణ మొదలుపెట్టడం జరిగింది. ” కరోనా క్రైసిస్ చారిటీ” పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్టు విరాళాలు సేకరించడం జరిగింది.
తెలుగు సినీ పరిశ్రమ తరఫున జరుగుతున్న కార్యక్రమానికి చిరంజీవి ట్రస్టు ద్వారా విరాళాలు సేకరించడం ఏంటి అని కొందరు విమర్శించారు. ఆ క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా నొచ్చుకున్నట్లు తెలిసింది.
ఐతే దీని వెనుక ఉన్న అసలు కారణం సినీ పెద్దల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ విపులంగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ కారణంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాక్షికంగా పని చేస్తున్నాయని.. ఈ సమయంలో కొత్తగా కరోనా చారిటీ కోసం ట్రస్టు పెట్టడం సాధ్యం కాలేదని.. దీంతో చిరంజీవి ట్రస్టు ద్వారా విరాళాల సేకరణ జరుగుతోందని సవివరంగా తెలిపారు.