spot_img
Homeజాతీయ వార్తలుపక్కా ప్లానింగ్ తో రెండో దశ లాక్ డౌన్?!

పక్కా ప్లానింగ్ తో రెండో దశ లాక్ డౌన్?!

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనా ఒక్కసారిగా భారత్ పై పడి, అటు అధికారులను, ఇటు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేయడంతో.. ఏమి పాలుపోని భారత్ యంత్రాంగం ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం జరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తేసి మరలా మే లో రెండో దశ లాక్ డౌన్ ను అమలు పరిచే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ విషయంపైనే ఏప్రిల్ 3న 16 మందితో కూడిన ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు.

ఈ మీటింగ్ అనంతరం కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 14 న లాక్‌ డౌన్ ఎత్తేసిన తర్వాత…. మే 15 నుంచి రెండో దశ లాక్‌ డౌన్ విధిస్తే ఎలా ఉంటుందని కేంద్ర మంత్రుల మధ్య చర్చ వచ్చినట్లు సమాచారం. అయితే మొదటి దశ లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఏ దుకాణాలు తెరవాలి? ఏ దుకాణాలు మూసి ఉంచాలన్నది కూడా మంత్రులు మాట్లాడుకున్నారు. లాక్‌ డౌన్ ఎత్తేసినా సరే… నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంచాలని,  అయితే ప్రజలు గుమిగూడటంపై మాత్రం నిషేధం కొనసాగించాలని వారు భావించినట్లు సమాచారం. సినిమా థియేటర్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలను మాత్రం తెరవకూడదన్న నిబంధన విధించాలని భావించారు

అయితే నిత్యావసరాలను అమ్మే మాల్స్‌కు, విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చి, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విదేశీయులకు అనుమతులిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగింది.  అయితే కరోనా వైరస్‌ తో బాగా ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రం వారం వారం సంతలకు అనుమతి ఇవ్వకూడదని, రాష్ట్రమంతటా కోవిడ్ – 19 పై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రులు భావించారు.

మరోవైపు క్వారంటైన్‌ లో ఉంటున్న వారిని జీపీఎస్ ట్రాకర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు, బాధ్యులు పర్యవేక్షించాలని, అయితే ఇది ఎంత వరకు సాధ్యమనేది మంత్రులు చర్చించారు.

ఇకపోతే ‘వర్క్ ఫ్రం హోం’ చేసే ఉద్యోగులకు మరో నెల పాటు ఇదే వసతి కొనసాగిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇక ఆసుపత్రుల్లో కూడా అత్యధికంగా రద్దీ లేకుండా ఆయా యాజమాన్యాలే బాధ్యత వహించేలా చూడాలని మంత్రుల బృందం భావించినట్లు సమాచారం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper