spot_img
Homeజాతీయ వార్తలువిజయశాంతి బిజెపి వైపు చూస్తున్నారా!

విజయశాంతి బిజెపి వైపు చూస్తున్నారా!


ప్రముఖ సినీ నటి విజయశాంతి ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రముఖ నాయకురాలు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల అనంతరం ఆమె కాంగ్రెస్ లో క్రియాశీలకంగా లేకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పదునైన వాఖ్యాలను సోషల్ మీడియాలో చేస్తూ తరచూ తన ఉనికి చాటుకొంటున్నారు.

అదే విధంగా ఆమె ఇప్పుడు మరోసారి కేసీఆర్ లక్ష్యంగా సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. అయితే ఈ పర్యాయం కాంగ్రెస్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయినా ప్రధాని నరేంద్ర మోదీని అవహేళన చేస్తూ మాట్లాడిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసిపై చర్య తీసుకోమంది డిమాండ్ చేశారు.

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి తొమ్మిది నిముషాల సేపు దీపాలు నిలిపివేసి మరో దీపం వెలిగించమని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. వెంటనే ఈ పిలుపును కాంగ్రెస్ నేతలు తూర్పుర బట్టారు. కరోనా వ్యతిరేక పోరాటంలో చేయవలసిన పనులు చేయకుండా ప్రచారం కోసం చేస్తున్నారంటూ మండి పడ్డారు.

అదే తరహాలో ఒవైసి సహితం ఇటువంటి పిలుపు ఇవ్వడం ద్వారా దేశాన్ని ఒక ఈవెంట్ మానేజ్మెంట్ వ్యవస్థగా మార్చివేస్తున్నారని ప్రధాని మోదీపై విరుచుకు పడ్డారు. ప్రధానిని అంత మాట అన్నందుకు సహజంగానే బీజేపీ నాయకులు కన్నెర్ర చేశారు. ఒవైసీని ఖండిస్తూ. నిందిస్తూ ప్రకటనలు చేశారు. సోషల్ మీడియా లో పెద్ద ప్రచారం నడిపారు.

అయితే దీపాలు వెలిగించే సమయం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు తీరికగా మేల్కొన్న విజయశాంతి ప్రధానిని అవహేళన చేస్తూ మాట్లాడిన ఓవైసీపై చర్య తీసుకోవాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.

ప్రధాని పిలుపుపై ఎవరైనా అవహేళనగా మాట్లాడితే కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్ గతంలో ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడెలాంటి చర్యలు ఉంటాయని ఆమె పశ్నించారు. సామాన్యుడికి ఒక న్యాయం అసదుద్దీన్‌కు ఒక న్యాయమన్న చందంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అనే విషయంపై సీఎం స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటూ ధ్వజమెత్తారు.

“దీపాన్ని ఆరాధించే దేశంలో అత్యధిక ప్రజల మనోభావాలకు సంబంధించిన దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సమర్థించారు” అంటూ ఆమె ఆ పోస్ట్ లో పేర్కొనడం గమనిస్తే ఆమె పరోక్షంగా కాంగ్రెస్ నేతలకు కూడా చురకలు పెట్టిన్నట్లు స్పష్టం అవుతుంది.

విజయశాంతి బిజెపి ద్వారానే రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. గతంలో వాజపేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరి, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడాపనిచేశారు. బిజెపి ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొంటూ వాజపేయి, అద్వానీ వంటి వార్లకు సన్నిహితంగా వ్యవహరించారు.

అయితే తెలంగాణ అంశంపై బిజెపిని విడిపోవడం, సొంతంగా పార్టీ పెట్టుకోవడం, తర్వాత టి ఆర్ ఎస్ లో చేరి ఎంపీ కావడం, తర్వాత కాంగ్రెస్ లో చేరడం చేశారు. చాలాకాలంగా ఆమె బీజేపీలోకి రావచ్చని ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇప్పట్లో రాష్ట్రంలో గాని, కేంద్రంలో గాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోవడంతో బిజెపి వైపు చూస్తున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి.

తాజాగా కరోనా వైరస్ గురించి ఆమె ఇస్తున్న ప్రకటనలు సహితం అటువంటి అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper