Homeఎంటర్టైన్మెంట్మ‌హా స‌ముద్రం కోసం గోవాలో స్పెషల్ 'సెట్'

మ‌హా స‌ముద్రం కోసం గోవాలో స్పెషల్ ‘సెట్’

Maha Samudram
RX 100 లాంటి సంచలన విజయం తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి నుండి రెండవ చిత్రంగా ‘మ‌హా స‌ముద్రం’ తెరకెక్కుతుంది. నెవెర్ బిఫోర్ కాంబినేషన్లో మల్టీ స్టార్రర్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, శర్వానంద్‌ లు హీరోలుగా చేయటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. లవ్ స్టోరీలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సిద్ధార్థ్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

Also Read: ఇప్పుడు రెడీ… అప్పుడు మెచ్యూరిటీ లేక నో చెప్పాను

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం గోవా చెక్కేయనుంది. దాదాపుగా ముప్పై శాతం షూటింగ్ గోవాలోనే చేయాల్సి ఉండగా, గ్యాంగ్ స్టర్ డెన్ లాగ ఓ ప్ర‌త్యేమైన సెట్ ని గోవాలోనే వేస్తున్నారట. ప్రధాన పాత్రధారుల మధ్య వచ్చే కీలకమైన సన్నివేశాలన్నీ ఇక్కడే షూట్ చేస్త్తారట. త్వరగా షూట్ పూర్తి చేసి ప్రకటించినట్లుగా ఆగస్టు 19న రావాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Also Read: ‘ఇదే మా కథ’ టీజర్ చూసి హీరో అజిత్ ప్రశంసలు

లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ కథానాయికలుగా కనువిందు చేయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోలకు సమానంగా ఇద్దరి హీరోయిన్ల క్యారెక్టర్లు ఉంటాయని చిత్రబృందం తెలిపింది. సినిమాలో శ‌ర్వా, సిద్ధార్ధ్‌ల పాత్ర‌లు స‌రికొత్త పంథాలో సాగుతాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ ‘పాయల్ రాజ్‏పుత్’ స్టెప్పులేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం సమకూరుస్తుండగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular