కరోనా వైరస్ తో విలవిల్లాడుతున్న సినీ కార్మికుల కోసం సినిమా పరిశ్రమకు చెందిన చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ , ప్రభాస్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ , రవి తేజ , వరుణ్ తేజ్ , నాగ చైతన్య వంటి స్టార్స్ అంతాముందుకొచ్చి ఆర్ధిక సాయం చేస్తున్నారు . ఇంకా సినీ పరిశ్రమకు చెందిన తమ్మారెడ్డి భరద్వాజ , పరుచూరి వెంకటేశ్వర రావు , డైరెక్టర్ ఎన్ . శంకర్ , కాదంబరి కిరణ్ కుమార్ , ఉత్తేజ్ , జీవిత వంటి వారు ఎందరో తమ వంతుగా సినీ కార్మికుల సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా స్పందిస్తుంటే సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నటుడు , బడా సినీ ఫ్యామిలీ కి చెందిన వ్యక్తి అయిన నందమూరి బాలకృష్ణ ఏమాత్రం స్పందించక పోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
మరో వంక బాలయ్య బాబు తన తదుపరి సినిమాల గురించి ఆలోచిస్తూ బిజీగా ఉన్నాడని వార్తలు వినవస్తున్నాయి. అందుకు నిదర్శనం గా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కి ఫోన్ చేసి ఒక సినిమా చేద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆ సినిమా తానే నిర్మించాలి అనుకొంటున్నట్టు కూడా వినవస్తోంది. రీసెంట్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తనకు బాలయ్య బాబు తో గాని మోక్షజ్ఞ తో గాని వర్క్ చేయాలనుంది అనడం ఈ వార్తకు బలాన్నిస్తోంది .
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Reason behind balakrishna silence on corona disaster
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com