Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: రెమ్యూనరేషన్ గట్టిగా పెంచేసిన స్టార్ హీరోయిన్... షాక్ అవుతున్న నిర్మాతలు ?

Rashmika Mandanna: రెమ్యూనరేషన్ గట్టిగా పెంచేసిన స్టార్ హీరోయిన్… షాక్ అవుతున్న నిర్మాతలు ?

Rashmika Mandanna: ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమా తోనే హిట్ అందుకుంది ఈ భామ. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన “గీతా గోవిందం”, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ కన్నడ బ్యూటీ. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి అందర్నీ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ బ్యూటీ తెగ హ్యాపీ ఫీల్ అవుతుంది.

rashmika mandanna demanding high remuneration for upcoming movies

కాగా ఈ సినిమా రిజల్ట్ ను బట్టి రెమ్యునరేషన్ పెంచాలని రష్మిక ప్లాన్ చేసినట్లు ఉంది. ‘పుష్ప’ పార్ట్ 1 కి రష్మికకు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చారట. ఇప్పుడు మరో కోటి రూపాయలు పెంచి రూ.3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట ఈ కన్నడ భామ. ఆమెకి ఉన్న ఫాలోయింగ్ కారణంగా నిర్మాతలు అంత మొత్తం ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.

దీంతో ‘పుష్ప’ పార్ట్ 2 కి రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతుంది రష్మిక. నేషనల్ క్రష్ అనిపించుకుంటున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల పరంగా చాలా బిజీగా ఉంటోంది. తెలుగులో శర్వానంద్ సరసన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టింది రష్మిక. ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మిషన్ మజ్ను’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular