మనకున్న మంచి నటీమణుల్లో ప్రియమణి ఒకరు. .జాతీయ ఉత్తమ నటి గా పురస్కారం అందుకొన్న ప్రియమణి ఈ మధ్య తెలుగు సినిమాల్లో నటించడం తగ్గించింది .2016 లో చివరి సారిగా ` మనవూరి రామాయణం ` చిత్రం లోకనిపించిన ఈమె ఇపుడు రెండు తెలుగు సినిమాల్లో దర్శనమివ్వ బోతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తున్న అసురన్ రీమేక్ `నారప్ప`చిత్రం లో నటించడం తో పాటు మరో తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమౌతోంది . రానా దగ్గుబాటి , సాయి పల్లవి కల్సి నటిస్తున్న “విరాట పర్వం1992 ” అనే పిరియాడికల్ చిత్రంలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం లాక్ డౌన్ తీసేయగానే మిగతా భాగం పూర్తి చేయబోతోంది.
ఏపీలో అదుపు గాని వైరస్… కేంద్రం సీరియస్
తాజాగా ఒక ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ‘ విరాట పర్వం 1992 ` చిత్రం గురించి చెబుతూ ఇందులో తాను నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్టుగా తెలిపింది పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందు తున్న ఈ చిత్రం 1992 ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనలతో , నక్సలిజం నేపధ్యం లో సాగుతుంది. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం లో రూపొందు తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి , సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా లాక్ డౌన్ పరిస్థితులు అన్ని చక్కబడ్డాక ఈ సంవత్సరం ద్వితీయార్ధం లో ఈ సినిమా విడుదల కానుంది .
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Priyamani turns naxalite for ranas virata parvam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com