పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ప్రతిపక్ష పార్టీల ఎత్తును చిత్తుచేసి ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని పాలిచేందుకు సిద్ధమవుతున్నాడు. అభివృద్ధికి ఆటంకం కలిగించే శక్తులను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే ఇదంతా నిజ జీవితంలో జరుగుతుందో లేదోగానీ.. ప్రస్తుతానికి సినిమాల్లో మాత్రం పవన్ చేసి చూపించబోతున్నాడు.
పవన్ కల్యాన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుసగా సినిమాలు చేస్తూ బీజీగా మారారు. తాజాగా పవన్ కల్యాణ్ కోసం దర్శకుడు పూరి జగన్మాథ్ రంగంలోకి దిగాడు. పొలిటికల్ కథాంశంతో ఓ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ను దర్శకుడు పూరి సీఎంగా చూపించబోతున్నాడట. దీనికి పవన్ కల్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్బిన బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి..
తాజాగా పవన్ రీఎంట్రీ మూవీగా `వకీల్సాబ్` తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. అదేవిధంగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలోనూ ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాలు పూర్తయ్యాక పవన్ పూరితో సినిమా చేయనున్నాడు. పవన్ ను సీఎంగా చూడాలనుకున్న అభిమానుల కోరికను పూరి ఇలా తీర్చేందుకు సన్నహాలు చేస్తున్నాడు.