Naga Chaitanya shocking reaction after seeing First Night scene with Samantha
Viral Video: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మనం మూవీని రీ రిలీజ్ చేశారు. మనం మూవీని చూసేందుకు దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో పాటు నాగ చైతన్య థియేటర్ కి వెళ్లారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హీరోయిన్ సమంతతో శోభనం సీన్ రాగానే నాగ చైతన్య రియాక్ట్ అయిన తీరు వైరల్ అవుతుంది.
2014లో విడుదలైన మనం మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. మూడు తరాల అక్కినేని హీరోలు ఈ చిత్రంలో నటించారు. ఏఎన్నార్, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలు చేశారు. చివర్లో అఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ విధంగా అక్కినేని హీరోలు అందరూ మనం మూవీలో భాగం అయ్యారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో విక్రమ్ కుమార్ ఆడియన్స్ కి కొత్త అనుభూతి పంచారు. ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.
నాగ చైతన్య-సమంత భార్యాభర్తలుగా, లవర్స్ గా రెండు భిన్నమైన పాత్రలు చేశారు. కాగా మనం మూవీ రీరిలీజ్ కి హాజరైన నాగ చైతన్య సమంతతో శోభనం సీన్ రాగానే ఒకింత అసహనం ఫీల్ అయ్యాడు. ఆయన కోపం ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. నాగ చైతన్య, సమంత 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం సమంత, నాగ చైతన్య కలిసి కనిపించింది లేదు. వారు ఓ సినిమా చేస్తారంటూ పుకార్లు వినిపించాయి.
అవి పుకార్లుగానే ఉండిపోయాయి. విడాకుల పై నాగ చైతన్య ఎన్నడూ మాట్లాడలేదు. సమంత మాత్రం పరోక్షంగా తన కోపాన్ని నాగ చైతన్య మీద ప్రదర్శించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడిపోయారు. ఇందుకు కారణాలు ఏమిటనేది తెలియరాలేదు. అయితే సమంత ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు కనడం ఇష్టం లేదని, కుటుంబ విలువలు పాటించడం లేదంటూ విమర్శించారు. ప్రస్తుతం సమంత, నాగ చైతన్య తమ వృత్తుల్లో బిజీగా ఉన్నారు.
#NagaChaitanya Watched #Manam Today at Devi 70mm !pic.twitter.com/48B2wgLe3F
— Rajesh Manne (@rajeshmanne1) May 23, 2024