Sai Dharam Tej
Sai Dharam Tej: హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వరుణ్ ఆమెను ప్రేమించారు. ఐదేళ్లకు పైగా వరుణ్, లావణ్య రిలేషన్ లో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్ళికి సిద్ధమయ్యారు. జూన్ 9న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరిగే సూచనలు కలవంటున్నారు. కాగా మెగా ఫ్యామిలీలో పెళ్లీడుకొచ్చిన మరొక హీరో సాయి ధరమ్ తేజ్. 36 ఏళ్ల సాయి ధరమ్ తేజ్ ఇంకా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. అయితే ఈయన పెళ్ళికి కూడా భాజాలు మోగే అవకాశం కలదంటున్నారు.
సాయి ధరమ్ తేజ్ సైతం ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడట. ఆమెను త్వరలో వివాహం చేసుకుంటాడంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఆమె ఎవరో కాదు రెజీనా కాసాండ్రా. కెరీర్ బిగినింగ్ లో సాయి ధరమ్ తేజ్ ఈ హీరోయిన్ తో చిత్రాలు చేశారు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో సాయి ధరమ్, రెజీనా కాసాండ్రా కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించిందట. చాలా కాలంగా సాయి ధరమ్, లావణ్య డేటింగ్ చేస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తోంది.
సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష ప్రమోషన్స్ లో సాయి ధరమ్ తేజ్ తన లవ్ స్టోరీస్ గురించి చెప్పడం విశేషం. డిగ్రీ చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి దగ్గరుండి పెళ్లి చేశాను. కారణం అప్పుడు నా దగ్గర డిగ్రీ తప్ప ఏమీ లేదని సాయి ధరమ్ తేజ్ అన్నారు. అలాగే ఒక అమ్మాయి ప్రేమ విషయంలో హ్యాండ్ ఇచ్చింది, అప్పటి నుండి అమ్మాయిలంటే భయం అన్నారు. తిక్క మూవీ హీరోయిన్ లారిసా బోనేసి చూడగానే నచ్చేసిందని, డేటింగ్ చేద్దామని అడిగితే ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిందని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
ప్రమాదం అనంతరం సాయి ధరమ్ నటించిన విరూపాక్ష భారీ విజయం సాధించింది. ప్రతిరోజూ పండగే అనంతరం సాయి ధరమ్ తేజ్ మరో క్లీన్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. జులై నెలలో విడుదలకు సిద్ధం అవుతుంది. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్నారు. బ్రో మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి.