సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అనౌన్స్ మెంట్ మాత్రమే మిగిలిన ఈ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా.. మే 31 అనౌన్స్ చేయాలని చూస్తున్నారనేది చాలా మంది మాట. అయితే.. అంతకన్నా ముందుగానే ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారట.
ఈ సినిమాను నిర్మించబోతున్నది హారిక, హాసిని సంస్థ అన్న సంగతి తెలిసిందే. అనౌన్స్ మెంట్ త్వరగా ఇవ్వాలని చూస్తున్న రాధాకృష్ణ.. ఈ మేరకు ప్రిన్స్ ను రిక్వెస్టు కూడా చేశారట. అయితే.. మహేష్ కూడా జాతకాలు, ముహూర్తాలను బాగానే నమ్ముతారని చెబుతారు. కాబట్టి.. ఈ మూఢం వెళ్లిన తర్వాత ప్రకటన వస్తే రావొచ్చని అంటున్నారు. లేదంటే.. మే 31 వరకు ఆగాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.
నిజానికి.. ఇప్పటికిప్పుడు ఈ సినిమాను ప్రకటించి చేసేది ఏమీలేదు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సర్కారువారి పాట పూర్తయిన తర్వాతే ఈ సినిమా మొదలు కావాల్సి ఉంది. అది జరగడానికి ఇంకా.. చాలా టైం ఉంది. కాబట్టి.. వీలు చూసుకుని మెల్లగా అనౌన్స్ చేస్తారని కూడా అంటున్నారు.
ఇక, స్టోరీ విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ వద్ద ఓ పాన్ ఇండియా మూవీతోపాటు.. కేజీఎఫ్ లాంటి కథ కూడా సిద్ధంగా ఉందట. ఇవి కాకుండా మరో మూడునాలుగు స్టోరీలు కూడా రెడీ ఉన్నాయట. అయితే.. వీటిలో ఏదో ఒకటి తీసుకోకుండా.. మహేష్ కోసం కొత్తగా మరో స్టోరీ సిద్ధం చేసే పనిలో పడ్డాడట దర్శకుడు. అది ‘అతడు’ మూవీ తరహాలో ఉంటుందని టాక్. మరి, ఫైనల్ గా స్టోరీ ఏంటీ? అనౌన్స్ మెంట్ ఎప్పుడు అన్నది రాబోయే రోజుల్లోనే చూడాలి.