ఈ ఏడాది సూపర్స్టార్ మహేశ్ బాబు కి చాలా బాగా కలిసి వచ్చింది. సంక్రాంతి బరిలో నిలబడి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఆ జోష్ లో 27వ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరిగాయి . కానీ కరోనా అడ్డుపడి షూటింగ్ లేట్ అవుతోంది. ముందు 27వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ మహేశ్ బాబు కి పూర్తి కథ నచ్చకపోవడంతో ఆగిపోయింది. దరిమిలా వంశీ పైడిపల్లి స్థానంలో గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ చేరాడు. కరోనా ఎఫెక్ట్ కారణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. కాబట్టి డైరెక్టర్ పరుశురామ్కు కావాల్సినంత టైమ్ దొరికింది. స్క్రిప్ట్ను మరింతగా మెరుగులు దిద్దే పనిలో పడ్డాడు.
అన్నీ కుదిరితే సూపర్స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31న పరుశు రామ్ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేసి జూలైలో రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. కాగా చాలాకాలం తరవాత మహేష్ బాబు ఈ మూవీ రూపం లో పూర్తి స్థాయి లవ్ స్టోరీ చేయబోతున్నాడు. కాగా ఈ చిత్రం లో సైఫ్ అలీ ఖాన్ కూతురు ,” కేదార్ నాధ్”, ” సింబా” ఫేమ్ సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించ నుంది. మరో ఆసక్తికరమైన విషయమేమంటే మహేశ్ బాబు నటించిన గత మూడు చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ని పక్కన పెట్టి పరుశురామ్ తనకు నచ్చిన, అచ్చి వచ్చిన గీత గోవిందం ఫేమ్ గోపీ సుందర్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాడని తెలుస్తోంది ఇక ఈ చిత్రం తరవాత మహేష్ బాబు రాజమౌళి తో చిత్రం చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాడట…కాగా ఈ చిత్రాన్ని హలో బ్రదర్ , .క్షణ క్షణం ఫేమ్ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ ఫై కె ఎల్ నారాయణ నిర్మించ నున్నాడు .