Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు…ఈయన ఏం చేసినా ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోతుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో చేయబోయే సినిమా మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్న మహేష్ బాబు.. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే సామాన్య జనాల లాగే మహేష్ బాబు కూడా ఒక సినిమాని బ్లాక్ లో టికెట్ కొని చూసాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అయిన మహేష్ బాబు చాలా సింపుల్ గా థియేటర్ కు వెళ్లి టికెట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కౌంటర్ లో టికెట్లు అయిపోవడంతో బ్లాక్ లో సినిమా టికెట్లు కొని ఒక సినిమా చూశారట. ఇంతకీ అది ఏ సినిమా అంటే అమీర్ ఖాన్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రంగీలా ‘.. అయితే ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది.
ఇక ఈ సినిమాకు టిక్కెట్లు దొరక్కపోతే మహేష్ బాబు బ్లాక్ లో టిక్కెట్లు కొని మరి సినిమా చూశారట. ఇక ఈ విషయం తెలుసుకున్న రామ్ గోపాల్ వర్మ మహేష్ చేత కూడా బ్లాక్ లో టిక్కెట్లు కొనిపించేలా తను సినిమా చేసినందుకు వర్మ చాలా హ్యపీ ఫీల్ అవుతున్నాడట… ఇక నిజానికి మహేష్ ఆ ఒక్క సినిమా అనే కాకుండా తను చెన్నైలో ఉన్నప్పుడు కమలహాసన్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలా సినిమాలు చూసే సమయంలో కూడా తను బ్లాక్ లో టికెట్లు కొని సినిమా చూడాల్సి వచ్చిందంటూ ఒక సందర్భంలో మహేష్ బాబు తనే స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాడు… ఇక ఈ న్యూస్ తెలిసిన చాలా మంది సూపర్ స్టార్ కృష్ణ కొడుకు అయి ఉండి మహేష్ బాబు కూడా సామాన్య జనాలలాగే థియేటర్ దగ్గరికి వెళ్లి టికెట్లు కొనుక్కొని సినిమా చూస్తాడా ఆయన అంత సింప్లిసిటీ తో పెరిగాడా అంటూ మహేష్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు…
ఇక మొత్తానికైతే ప్రస్తుతం మహేష్ బాబు ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సంవత్సరం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన గుంటూరు కారం సినిమా నిరాశ పరిచినప్పటికి, రాజమౌళి తో చేయబోయే సినిమాతో ఎలాగైనా తన సత్తా చాడడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…