Homeఎంటర్టైన్మెంట్Samantha: సమంత పరువు నష్టం కేసులో... తీర్పును రేపటికి వాయిదా వేసిన కోర్టు

Samantha: సమంత పరువు నష్టం కేసులో… తీర్పును రేపటికి వాయిదా వేసిన కోర్టు

Samantha: సమంత – అక్కినేని నాగచైతన్య వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు గడిచిన తరువాత…  ఇటీవల అనూహ్యంగా తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో వారు విడిపోవడానికి ఇదే కారణం అంటూ… ఎవరికి నచ్చినట్లుగా వారు వార్తలు రాశారు. అలానే సామ్ – చైతూ విడిపోవడానికి సమంతనే కారణం అంటూ ఆమె పై కధనాలు కూడా వచ్చాయి. అయితే ఇందుకు గాను తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా కధనాలు ప్రచురించిన మూడు యూట్యూబ్ ఛానల్ పై కూకట్ పల్లి కోర్టులో… సమంత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

kukatpally court postpone judgement for tomorrow in samantha defamation case

ఇప్పుడు తాజాగా సమంత వేసిన పిటిషన్ పై కూకట్ పల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమంత దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును  రేపటికి వాయిదా వేసింది. ఈరోజు  కోర్టు సమయం ముగియడంతో తీర్పును రేపు వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించినట్లు తెలుస్తుంది.

కేసుకు సంబంధించి సమంత తరఫు న్యాయవాది బాలాజీ వడేరా పలు వాదనలు వినిపించారు. చైతూ – సామ్ జంట  విడాకులు ఇంకా తీసుకోలేదని … ఆ లోగా ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని వెల్లడించారు. సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు రాశారని … ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని కోర్టుకు విన్నవించారు. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా … తీర్పు ఇవ్వాలని న్యాయవాది బాలాజి  కోర్ట్ ను కోరారు.

తప్పు జరిగిందని భావిస్తే పరువు నష్టం దాఖలు చేసే బదులు , వారి నుండి క్షమాపణలు కొరొచ్చు కదా అని కోర్టు  ప్రశ్నించింది. సెలబ్రిటీ ల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే… పరువుకు భంగం కలిగింది అనేది వారే కదా అని చురకలు అంటించింది. కోర్టు ముందు సెలబ్రిటీలు, మామూలు ప్రజలు అందరూ సమానమేనని కోర్టు వెల్లడించింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular