Thandel: నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు అమ్మడు సాయి పల్లవి కూడా టాలీవుడ్ లో ఫుల్ ఫేమస్ అయింది. ఈమె నటించిన ఫిదా సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ను సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈమె ఈ మధ్య ఎక్కువ సినిమాల్లో నటించకపోవడంతో అసలు సాయి పల్లవి సినిమాలు చేస్తుందో లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ఈ అనుమానాలకు పులిస్టాప్ పెడుతూ.. కొన్ని సినిమాలను ఒప్పుకుంది సాయి. ఇక ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
చందు మొండేటి ఇప్పటికే కార్తికేయ 2 సినిమా తర్వాత డిఫరెంట్ జోనర్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రియల్ స్టోరీని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఇందులో సాయి పల్లవి పాత్ర ఏంటని.. ఆమె ఎలా నటించబోతుందని కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా స్టోరీ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా చివర్లో సాయి పల్లవి చనిపోతుందని టాక్. ఇది విన్న అభిమానులు ఆమె చనిపోతే సినిమా సక్సెస్ అవదని.. ఆమె క్యారెక్టర్ ను బతికించే ప్రయత్నం చేయండి అంటూ చందు మొండేటికి చాలా మెసేజ్ లు పెడుతున్నారు. అయితే రానా సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన విరాట పర్వం సినిమాలో కూడా సాయి పల్లవి చనిపోతుంది.
అందుకే ఈ సినిమా పెద్దగా హిట్ అవలేదని.. ఇక తండేల్ లో అయినా ఆమెను బతికించండి లేదంటే విరాట పర్వం మాదిరి అవుతుంది అంటూ సలహాలు ఇస్తున్నారు సాయి పల్లవి అభిమానులు. అయితే నాగచైతన్య చేపల వేట కోసం వెళ్లి పాకిస్థాన్ పోలీసులకు దొరికిపోతాడట. ఇక ఈయనను విడిపించడానికి వెళ్లే ప్రయత్నంలో సాయి పల్లవి తన ప్రాణాలను విడిచిపెడుతుందని టాక్. మరి లీక్ అయినా ఈ స్టోరీ నిజమో.. కాదో తెలియాలంటే సినిమా విడుదల అవ్వాల్సిందే..