VIjay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. తెలుగులో విడుదలైన మాస్టర్, ఉప్పెన సినిమాలతో విజయ్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన లాభం, ఆనబెల్ సేతుపతి చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేశారు. అయితే సేతుపతిపై బెంగళూరు ఎయిర్పోర్టులో ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. తెలుగు, తమిళ నాట ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అతనిని ఓ వ్యక్తి ఎగిరి తన్నడం ఆయన అభిమానులకు ఎంతో బాధను కలిగించింది.
కాగా ఈ దాడి చేయడం వెనకాల గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఇప్పుడు మరో కారణం తెరపైకి వచ్చింది. విజయ్పై దాడి చేసిన వ్యక్తి పేరు జాన్సన్ అని… బెంగళూరులో నివాసముండే ఇతడు మలయాళీవాసి అని తెలుస్తోంది. విజయ్ తో సెల్ఫీ కోసం ప్రయత్నించగా అతన్ని… విజయ్ అసిస్టెంట్లు అడ్డుకున్నారు. ఈ మేరకు వారి మధ్య చిన్న వాగ్వాదం తలెత్తిందని అందుకే అది మనసులో పెట్టుకొని ఆవేశంతో విజయ్ను తన్నాడు అని తెలుస్తుంది. ఆ వెంటనే అతన్ని విజయ్ సేతుపతి టీమ్ సభ్యులు అడ్డుకోవడం తెలిసిందే. కాగా ఆ వ్యక్తి విజయ్ సేతుపతికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. అలానే అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయొద్దని విజయ్ సేతుపతి కోరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
Actor #VijaySethupathi was attacked at bangalore airport.
This is a Bad thing.. he is a celebrity.. 😠
— Akash (@massavatar) November 3, 2021
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More