Homeఎంటర్టైన్మెంట్హెల్ప్ కరోనా అంటున్న భీష్ముడు

హెల్ప్ కరోనా అంటున్న భీష్ముడు

ప్రకృతి  విపత్తులు వచ్చినపుడు అందరం కలిసికట్టుగా పోరాడాలి. సమాజం క్షేమంగా ఉన్నపుడే జాతీయ పతాకం గర్వంగా ఎగురుతుంది . సెలబ్రిటీ నుంచి సామాన్యుడి దాకా అందరూ సమాజంలో భాగమే… జాతికి ఆపద వచ్చినపుడు ఎవరికి వారు తమకు తోచినంత సహాయం చేయాలి …ప్రస్తుతం ప్రపంచం కరోనా సమస్య తో విలవిలలాడి పోతోంది. కరోనా  విపత్తు భారత దేశానికి అంతగా ఉండదు అనుకొన్నారు. కానీ ఊహించని రీతిలో మానవ సంహారి కరోనా ఇండియా లో కూడా ప్రవేశించింది  అందులో […]

ప్రకృతి  విపత్తులు వచ్చినపుడు అందరం కలిసికట్టుగా పోరాడాలి. సమాజం క్షేమంగా ఉన్నపుడే జాతీయ పతాకం గర్వంగా ఎగురుతుంది . సెలబ్రిటీ నుంచి సామాన్యుడి దాకా అందరూ సమాజంలో భాగమే… జాతికి ఆపద వచ్చినపుడు ఎవరికి వారు తమకు తోచినంత సహాయం చేయాలి …ప్రస్తుతం ప్రపంచం కరోనా సమస్య తో విలవిలలాడి పోతోంది. కరోనా  విపత్తు భారత దేశానికి అంతగా ఉండదు అనుకొన్నారు. కానీ ఊహించని రీతిలో మానవ సంహారి కరోనా ఇండియా లో కూడా ప్రవేశించింది  అందులో మన తప్పిదం స్వల్పమే అయినా ఫలితం మాత్రం దారుణం గా ఉండ బోతోంది .

రాబోయే ఉపద్రవాన్ని ముందుగానే పసిగట్టిన రెండు తెలుగు రాష్ట్రాలు గట్టిగానే చర్యలు చేపట్టాయి, ఇంకా చేపడుతూనే ఉన్నాయి. కరోనా నివారణకు యెంత ఖర్చు అయినా వెనుకాడేది లేదు అని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కృత నిశ్చయం తో ఉన్నారు. అలాంటి స్థితిలో దాతలు ముందుకి వస్తేనే ప్రభుత్వానికి అండగా ఉంటుంది. ఈ విషయం గుర్తించిన అంబానీ , మహేంద్ర లాంటి కొందరు వ్యాపార ప్రముఖులు తమ వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇంకా చాలా మంది వస్తారని అంటున్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమ కూడా దేశ ప్రజలకు అండగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది   కాగా ఈ విషయం లో తొట్ట తొలి అడుగు  పడింది.  రీసెంట్ గా భీష్మ చిత్రం తో మంచి విజయం చవి చూసిన యువ కథానాయకుడు  నితిన్  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సహాయ నిధికి చెరో పది లక్షల చొప్పున 20 లక్షల రూపాయలను అందజేసి తన ఔనత్యాన్ని చాటు కొన్నాడు. a small help can save the big problem
admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper