ప్రకృతి విపత్తులు వచ్చినపుడు అందరం కలిసికట్టుగా పోరాడాలి. సమాజం క్షేమంగా ఉన్నపుడే జాతీయ పతాకం గర్వంగా ఎగురుతుంది . సెలబ్రిటీ నుంచి సామాన్యుడి దాకా అందరూ సమాజంలో భాగమే… జాతికి ఆపద వచ్చినపుడు ఎవరికి వారు తమకు తోచినంత సహాయం చేయాలి …ప్రస్తుతం ప్రపంచం కరోనా సమస్య తో విలవిలలాడి పోతోంది. కరోనా విపత్తు భారత దేశానికి అంతగా ఉండదు అనుకొన్నారు. కానీ ఊహించని రీతిలో మానవ సంహారి కరోనా ఇండియా లో కూడా ప్రవేశించింది అందులో మన తప్పిదం స్వల్పమే అయినా ఫలితం మాత్రం దారుణం గా ఉండ బోతోంది .