Karthikeya: ఆర్ఎక్స్ 100తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత వరుసగా విభిన్న కథాంశాలతో పలకరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఇటీవల రాజా విక్రమార్క సినిమాతో పలకరించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఇంకా థియేటర్లలో ఆడుతున్న ఈ సినిమా.. మంచి వసూళ్లు సాధిస్తోంది. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తికేయ తన ప్రియురాలు లోహితను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ.. అందరి ముందు ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరిచారు.
ఇటీవలే వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా, వీరిద్దరి పెళ్లికి ముహూర్తం కూడా ఖరారైంది. నవంబరు21 ఆదివారం ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహిత-కార్తికేయ మూడుముళ్ల బంధంతో ఒకటవనున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ ముహుర్తానికి సంబంధించి కార్తికే, లోహిత కుటుంబ సభ్యులు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.
2010లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. వరంగల్ నిట్లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా చిగురించింది. అయితే, 2018లో ఆర్ఎక్స్100తో పరిచయమైన కార్తికేయ. తన ప్రేమ గురించి ఎక్కడా ప్రస్థావించలేదు. ఈ ఏడాది ఆగస్టులో తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకుని.. ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రస్తుతం రాజా విక్రమార్క విజయంతో చిల్ అవుతున్నారు కార్తికేయ. మరోవైపు, అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న వలిమై సినిమాతో తమిళ ప్రజలకు పరిచయమవనున్నారు కార్తికేయ.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Hero karthikeya marriage invitation card going viral at social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com