Urvashi Daughter: కేరళలో పుట్టిన మలయాళీ భామ ఊర్వశి 80-90 లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆమె మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల్లో నటించింది. స్టార్స్ తో జతకట్టింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఊర్వశి 1979లో కెరీర్ మొదలుపెట్టింది. మమ్ముట్టి హీరోగా 1984లో విడుదలైన మలయాళ చిత్రం ఎతిర్పుక్కళ్ తో హీరోయిన్ గా మారింది. వందకు పైగా చిత్రాల్లో ఆమె లీడ్ హీరోయిన్ రోల్స్ చేసింది. . ఉర్వశికి సౌత్ ఇండియా మొత్తం మార్కెట్ ఉండేది.
ఇక తెలుగులో ఊర్వశి మొదటి చిత్రం రుస్తుం. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా ఆమె నటించారు. భలే తమ్ముడు చిత్రంలో బాలయ్యతో జతకట్టింది. దర్శకుడు వంశీ తెరకెక్కించిన చెట్టు క్రింద ప్లీడర్ మూవీలో కీలక రోల్ చేసింది. ఆమె లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఇటీవల కాలంలో ఊర్వశికి తెలుగులో మంచి పేరు తెచ్చిన చిత్రం ఓ బేబీ.
ఈ చిత్రంలో నటి లక్ష్మితో ఊర్వశి కాంబినేషన్ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఆడవాళ్ళు మీకు జోహార్లు, అన్నీ మంచి శకునములే చిత్రాల్లో ఊర్వశి చక్కని పాత్రలు చేసింది. కాగా ఊర్వశికి రెండు వివాహాలు జరిగాయి. 2000 సంవత్సరంలో ఊర్వశి మలయాళ నటుడు మనోజ్ కే జయన్ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి సంతానం. పేరు తేజ లక్ష్మీ. మనోజ్ తో విడిపోయిన అనంతరం 2013లో శివ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
ఊర్వశి-శివ ప్రసాద్ లకు అబ్బాయి సంతానంగా ఉన్నాడు. మొదటి భర్త సంతానం తేజ లక్ష్మీ కూడా ఊర్వశి వద్దే పెరుగుతుంది. కాగా ఊర్వశి తన ఇంస్టాగ్రామ్ లో పిల్లలతో దిగిన ఫోటో షేర్ చేశారు. సదరు ఫొటోల్లో ఊర్వశి కుమార్తె తేజ లక్ష్మిని చూసి నెటిజెన్స్ అవాక్కు అవుతున్నారు. ఊర్వశి కూతురు చాలా అందంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో తేజ లక్ష్మి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనుందట. అమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోయిన్ గా రాణించాలని ఆశపడుతుందట.