Homeఆంధ్రప్రదేశ్‌వంగవీటి రాధాను అందుకే లైట్‌ తీసుకుంటున్నారా..?

వంగవీటి రాధాను అందుకే లైట్‌ తీసుకుంటున్నారా..?

కృష్ణ జిల్లా రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడు వంగవీటి రాధా. వంగవీటి రాధాను ఇప్పుడు ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నా యాక్టివ్‌గా లేకపోవడం.. పెద్దగా బలగం లేకపోవడం కూడా కారణంగా తెలుస్తోంది. ఆయన కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ తన రాజకీయ జీవితానికి తానే సమాధి కట్టుకున్నారనే చెప్పాలి. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా మొత్తం నాలుగు పార్టీలు మారి ఇప్పుడు రాజకీయంగా టెంపరరీ రిటైర్మెంట్‌ను తానే తీసుకున్నాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధా వరుసగా టర్న్‌లు తీసుకుంటూ తానే పాలిటిక్స్ నుంచి టర్న్ అయిపోయారు.

Also Read: వంగవీటి రాధాను అందుకే లైట్‌ తీసుకుంటున్నారా..?

నిజానికి తండ్రి ఇమేజ్‌ను ఉపయోగించుకుని ఏపీ లాంటి రాష్ట్రంలో వంగవీటి రాధా ఉన్నతస్థాయికి ఎదగాల్సి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత రాధా రాజకీయం మరింత మెరుగుపడాల్సి ఉండగా రోజురోజుకూ దిగజారిపోతోంది. దీనికి కారణం ఆయన ఎక్కువగా ప్రజల్లో కలిసి ఉండరనేది టాక్‌. తాజాగా కృష్ణానదికి వరదపోటెత్తి విజయవాడ నగరంలోని కృష్ణలంక, భూపేష్ గుప్తా నగర్, రామలింగేశ్వర్ నగర్ వంటి మునిగిపోయి నిరాశ్రయులైనా పలకరించేందుకు రాలేదు.

గతంలో వైసీపీలో కొనసాగినప్పుడు ఆయనకు ఏదో ఒక పదవి ఉండేది. ఇక వైసీపీని వదిలి టీడీపీలో చేరగా.. ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో వంగవీటి రాధా పదిహేను నెలలుగా మౌనంగానే ఉండిపోయారు. ఈ మధ్య జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా ఆ దిశగా అడుగులు వేయలేదు. తన తండ్రి రంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు తప్ప ఆయన బయటకు రారనేది విజయవాడలో విన్పిస్తున్న టాక్.

Also Read: భారీ వర్షం.. రైతులకు తీరని నష్టం.. పంటనష్టం ఎంతంటే..?

ఇటీవల చంద్రబాబు కమిటీని నియమించారు. కానీ.. అందులో వంగవీటి రాధాకు ప్రాధాన్యం దొరకలేదు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ బందరు పార్లమెంటు టిక్కెట్‌ను ఆఫర్ చేసింది. అయినా వంగవీటి రాధా టీడీపీలోకే వెళ్లారు. టీడీపీ కూడా గత ఎన్నికల్లో ఎక్కడా టిక్కెట్ కేటాయించలేదు. అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేయాలని చంద్రబాబు కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా పదవుల భర్తీలో వంగవీటి రాధాకు ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడంపై ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అంటిముట్టనట్లుగా ఉండడంతో పార్టీలు కూడా అతన్ని లైట్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular