Pawan Kalyan director Krish : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో శెరవేగంగా సాగుతుంది..సినిమాకి ఎంతో కీలకమయ్యే ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశం ని వెయ్యి మంది ఆర్టిస్టులతో సుమారు 10 కోట్ల రూపాయిలు ఖర్చుపెట్టి ఈ సన్నివేశం ని తెరకెక్కిస్తున్నారు..గత వారం రోజుల నుండి పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు..ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ గెడ్డం లుక్ లోనే కనిపిస్తాడట.
మొత్తం మీద పవన్ కళ్యాణ్ సినిమాలో మూడు డిఫరెంట్ లుక్స్ మరియు 30 రకాల కాస్ట్యూమ్స్ తో కనిపిస్తాడట..పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే చిరాస్తాయిగా గుర్తుండిపోయ్యేలాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ క్రిష్..ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండడం తో అభిమానులు ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు..జనవరి నెలాఖరు నుండి ఈ యాత్ర ప్రారంభం కానుంది..ఈ నేపథ్యం లో ‘హరి హర వీరమల్లు ‘ షూటింగ్ ని డిసెంబర్ నెలాఖరు లోపు తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసి..డబ్బింగ్ కూడా చెప్పించేసుకోమని పవన్ కళ్యాణ్ చాలా స్ట్రిక్ట్ గా క్రిష్ కి చెప్పాడట..ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనుంది..ఈ షెడ్యూల్ తర్వాత మరో షెడ్యూల్ కూడా గ్యాప్ లేకుండా ప్రారంభం కానుంది..ఎట్టిపరిస్థితిలో కూడా డిసెంబర్ నెలలో షూటింగ్ పూర్తయ్యేలా చూడాలని..లేకపోతే అసలు బాగుండదని క్రిష్ కి చాలా గట్టిగా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఎందుకంటే క్రిష్ జాప్యం వల్లే భీమ్లా నాయక్ విడుదలైన ఆరు నెలల వరుకు షూటింగ్ ప్రారంభానికి నోచుకోలేకపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్..ఇక పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా ఔట్పుట్ మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించారు..అంతే కాకుండా ఈ సినిమాకోసం గా పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకమైన శిక్షణ నేర్చుకున్నాడట.