Pawan Warns Top Producer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రమశిక్షణకు మారుపేరు. తను రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా చాలా పద్ధతిగా ఉంటారు. నలుగురికి ఆదర్శంగా ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ బారిన పడ్డాక ఇటీవలే పవన్ మళ్లీ షూటింగ్ లతో బిజీ అయ్యారు. తన క్రమశిక్షణనే ప్రశ్నించిన నిర్మాతకు పవన్ క్లాస్ తీసుకున్నట్టు టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ముందుగా క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాను పవన్ చేయాల్సి ఉంది. ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏమైందో కానీ ఆ సినిమాను పక్కనపెట్టి ‘బీమ్లా నాయక్’ మూవీని షూటింగ్ కు మారిపోయాడు. బీమ్లా నాయక్ పూర్తి చేశాక ‘హరిహర వీరమల్లు’ కోసం టైం కేటాయించేందుకు పవన్ సిద్ధమయ్యారు. పూర్తి చారిత్రక సినిమా కావడంతో దీనికోసం ఎక్కువ డేట్స్ ఇచ్చి మంచిగా చేయాలని పవన్ గ్యాప్ ఇచ్చాడట.. తొందరపడకుండా పూర్తి చేయాలని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట.. మంచి చారిత్రక సినిమా కావడంతో ఔట్ పుట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
అయితే ‘హరిహర వీరమల్లు’ మూవీని పవన్ ఆపేయడంతో నిర్మాత ఏఎం రత్నం తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడని తెలిసింది. సినిమాకు పెట్టిన ఖర్చు తడిసి మోపెడవుతుందని తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట.. తన సినిమా పూర్తి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తన బాధలను ఏకరువు పెట్టి పవన్ కళ్యాణ్ కు ఓ భారీ మెసేజ్ చేశాడట.. రూ.150 కోట్లు బడ్జెట్ పెడుతున్నామని.. కాస్త కనికరించండి అంటూ మెసేజ్ చేశాడు.
దీనిపై పవన్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేసే లేదో పర్సనల్ గా కలిసి మాట్లాడితే బాగుంటుందని.. ఇలా మెసేజ్ పెట్టడం ఏంటని పవన్ స్వయంగా ఫోన్ చేసి మరీ నిర్మాత ఏఎం రత్నంకు భారీ క్లాస్ తీసుకున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మీరు నన్ను నమ్మి రూ.150 కోట్లు పెట్టడం లేదని.. కథను నమ్మి ఈ డబ్బు పెడుతున్నారని..’ ఓ రేంజ్ లో పవన్ ఫైర్ అయినట్టు ప్రచారం సాగుతోంది. నన్ను బ్లెయిమ్ చేయవద్దంటూ హితవు పలికాడట.. ప్రస్తుతం ఈ వార్త ఫిలింనగర్ లో తెగ చక్కర్లు కొడుతోంది.