కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఎట్టకేలకు భార్య, పిల్లలను కలిశాడు. ఈ ఆనందంలో వారితో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒకే ఇంట్లో ఉన్నా.. తమకు దూరంగా ఉన్న కళ్యాణ్ఎట్టకేలకు తమతో కలవడంతో ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఉంది. ఇంట్లోనే ఉన్న కళ్యాణ్ ఇన్నాళ్లూ కుటుంబానికి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అనుకుంటున్నారా? దంపతుల మధ్య విభేదాలు వచ్చాయని అనుమానం కలుగుతోందా? అలాంటిదేం లేదు. ఇది కరోనా కాలం కాబట్టి కళ్యాణ్ ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. సుదీర్ఘ లాక్డౌన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్కు గత నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా ఉధృతి నేపథ్యంలో చాలా మంది సెట్స్పైకి వచ్చేందుకు భయపడ్డారు. కానీ, కళ్యాణ్ దేవ్ మాత్రం తాను నటిస్తోన్న ‘సూపర్ మచ్చి’ కోసం ధైర్యం చేసి షూటింగ్లో పాల్గొన్నాడు. దాంతో ఈ చిత్రంలో మిగిలిపోయిన సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేశాడు. డబ్బింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేశారు.
కరోనా నేపథ్యంలో షూటింగ్ లో పాల్గొన్నన్ని రోజులు కళ్యాణ్ స్వీయ నిర్బంధం పాటించాడు. షూటింగ్ నుంచి వచ్చిన వెంటనే ఇంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లోని ఓ గదిలో ఒక్కడే ఉన్నాడు. ముద్దులొలికే చిన్న కూతురు సహా ఎవ్వరినీ కలువలేదు.
ఈ క్రమంలో తమ పెద్ద కుమార్తె బర్త్డేను మిస్ అవుతున్నానని ఆ మధ్యన ఓ పోస్ట్ కూడా చేశారు. సినిమా పనులు అన్నీ పూర్తయిన తర్వాత కూడా ముందు జాగ్రత్తగా 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఆ టైమ్ పూర్తయ్యాక కరోనా టెస్ట్ను చేయించుకున్నారు. అందులో అతనికి నెగిటివ్ అని రావడంతో మెగా ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టాలో వెల్లడించిన కల్యాణ్ దేవ్.. చాలా రోజుల తర్వాత భార్య, కూతుళ్లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘ షూటింగ్ మొదలైనప్పటి నుంచి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నా. ఇన్ని రోజులు ఎదురుచూశా. కరోనా టెస్ట్ చేయించుకున్నా. నెగిటివ్ అని తేలింది. నా గురించి ఆలోచించిన అందరికీ థ్యాంక్స్. మీ అందరి ప్రేమను పొందుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఈ గ్రూప్ హగ్ కోసం నేను చాలా రోజులుగా ఎదురుచూశా. ఈ హగ్ని మిస్ అయ్యా’ పేర్కొన్నాడు. పులి రాజు దర్శకత్వం వహించిన ‘సూపర్ మచ్చి’ సినిమా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుందని సమాచారం.
https://www.instagram.com/p/CCbQFikhfBG/