
ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తున్న కరోనా మహమ్మరి కట్టడికి పలువురు సెలబ్రెటీలు అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, ట్వీట్లు చేస్తూ సామాజిక బాధ్యతను గుర్తుచేస్తున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా కోడలు ఉపాసన, మహేష్ బాబు కూతురు సితార తదితరులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ కరోనాపై వినూత్నంగా సందేశం ఇచ్చింది. ఈ మేసేజ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఇటీవల టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లు కరోనాపై ఓ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు కోటి సంగీతాన్ని అందించాడు. ఈ సాంగ్ అందరి ప్రశంసలు పొందిన సంగతి తెల్సిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి ప్లకార్డులు చూపిస్తూ ఓ సందేశం ఇచ్చారు. ‘ఇంట్లో ఉంటాం..యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు.. ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం.. భారతీయులం ఒక్కటై.. భారత్ని గెలిపిస్తాం..’ అంటూ ప్లకార్డులు పట్టుకొని మెగా ఫ్యామిలీ స్టే హోమ్ అంటూ సందేశాన్నిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ లు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ఫొటోల్ని కూడా ఎవరింట్లో వాళ్లు ఉంటూ షూట్ చేసి పోస్టు చేశారని మెగాస్టార్ ట్వీట్ చేశారు.
Together we WILL WIN this War!
Let us STAY where we are.
Let us keep ourselves,our dear ones and the world safe.#SimpleStepsToWinAMightyWar#UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/PXys8AE6JB— Chiranjeevi Konidela (@KChiruTweets) April 15, 2020